ప్రేమ కోసం ప్రాణాలు తీసుకున్నారు.. విగ్రహాలకు పెళ్లి చేశారు.. ఎక్కడ?

Webdunia
గురువారం, 19 జనవరి 2023 (23:25 IST)
idols marriage
ప్రేమ పెళ్లితోనే సుఖాంతం అవుతుందని నమ్మే కాలం పోయింది. ప్రేమ కోసం త్యాగాలు చేసే వారి సంఖ్య కూడా కరువైంది. స్మార్ట్ ఫోన్ కాలం వచ్చేసింది. సోషల్ మీడియాలో ప్రేమించుకునే వారి సంఖ్య పెరిగింది. ఇలాంటి కాలంలోనే ప్రేమకు విలువనిచ్చే వారున్నారు. ఆ ప్రేమ కారణంగా ప్రాణాలు విడిచినా.. బుద్ధి తెలుసుకుని వారి విగ్రహాలకు పెళ్లి చేసిన పెద్దల వ్యవహారం గుజరాత్ లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. గుజరాత్ రాష్ట్రంలో గత ఆరు నెలల క్రితం తమ ప్రేమకు పెళ్లితో ముగింపు రాలేదని.. ఓ జంట బలవన్మరణానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఆ జంటకు చెందిన విగ్రహాన్ని ప్రతిష్టించి పెళ్లి చేయడం జరిగింది. గుజరాత్‌లోని దాబీలో నివసించే గణేష్ అదే ప్రాంతానికి చెందిన రంజన అనే అమ్మాయిని ప్రేమించాడు.
 
పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఇంట్లో మాట్లాడుకున్నారు. అయితే కుటుంబ సభ్యులు ఇందుకు అంగీకరించకపోవడంతో గత ఆగస్టులో ఇద్దరూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 
 
వీరిద్దరి ఆత్మహత్యను జీర్ణించుకోలేని పెద్దలు పశ్చాత్తాపంతో  వారి విగ్రహాలను తయారు చేసి ఆ విగ్రహాలకు పెళ్లి చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇలా ఆ ప్రేమికుల ఆశ బతికుండగా జరగకపోయినా.. మరణానికి అనంతరం నెరవేరిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ లేదని చెబుతున్న లక్ష్మణ్ టేకుముడి, రాధికా జోషి

Director Vasishta, : జంతువుల ఆత్మతోనూ కథ తో నెపోలియన్ రిటర్న్స్

Vishnu: విష్ణు విశాల్... ఆర్యన్ నుంచి లవ్లీ మెలోడీ పరిచయమే సాంగ్

Gopichand: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి సినిమా భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్

నారా రోహిత్, శిరీష ప్రీ - వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం.. పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments