Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో కలకలం : తొలి కరోనా స్ట్రైన్ తొలి పాజిటివ్ కేసు నమోదు!!

Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2020 (14:17 IST)
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో కలకలం రేగింది. తొలి కరోనా స్ట్రైన్ కేసు నమోదైంది. బ్రిటన్ నుంచి చెన్నైకు వచ్చిన వ్యక్తికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. దీంతో ఆ వ్యక్తిని క్వారంటైన్‌కు తరలించారు. అలాగే, బ్రిటన్ నుంచి వచ్చిన మరికొంతమందిని ముందు జాగ్రత్త చర్యగా వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. 
 
నిజానికి ఇప్పటికే కరోనా వైరస్ దెబ్బకు ప్రతి ఒక్కరూ హడలిపోతున్నారు. ముఖ్యంగా, అగ్రరాజ్యాలకు చెందిన ప్రజలు సైతం వణికిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో బ్రిటన్‌లో కొత్త రకం వైరస్ పుట్టుకొచ్చింది. పైగా, ఇది శరవేగంగా వ్యాపిస్తోంది. దీంతో బ్రిటన్ అంటేనే ఇతర దేశాల ప్రజలు హడలిపోతున్నారు. 
 
ఈ నేపథ్యంలో బ్రిటన్ నుంచి ఢిల్లీ వచ్చిన సదరు వ్యక్తి అక్కడి నుంచి చెన్నై చేరుకున్నాడు. కరోనా సోకినట్టు తేలడంతో అతడిని క్వారంటైన్‌లో ఉంచారు. బ్రిటన్‌లో రూపాంతరం చెందిన కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆ వ్యక్తి నుంచి నమూనాలు సేకరించి పూణేలోని జాతీయ వైరాలజీ సంస్థకు పంపించారు. ఆ వ్యక్తికి సోకింది కరోనా కొత్త రకం వైరస్సా? కాదా? అనేది పరీక్షల అనంతరం వెల్లడి కానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments