Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో కలకలం : తొలి కరోనా స్ట్రైన్ తొలి పాజిటివ్ కేసు నమోదు!!

Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2020 (14:17 IST)
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో కలకలం రేగింది. తొలి కరోనా స్ట్రైన్ కేసు నమోదైంది. బ్రిటన్ నుంచి చెన్నైకు వచ్చిన వ్యక్తికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. దీంతో ఆ వ్యక్తిని క్వారంటైన్‌కు తరలించారు. అలాగే, బ్రిటన్ నుంచి వచ్చిన మరికొంతమందిని ముందు జాగ్రత్త చర్యగా వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. 
 
నిజానికి ఇప్పటికే కరోనా వైరస్ దెబ్బకు ప్రతి ఒక్కరూ హడలిపోతున్నారు. ముఖ్యంగా, అగ్రరాజ్యాలకు చెందిన ప్రజలు సైతం వణికిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో బ్రిటన్‌లో కొత్త రకం వైరస్ పుట్టుకొచ్చింది. పైగా, ఇది శరవేగంగా వ్యాపిస్తోంది. దీంతో బ్రిటన్ అంటేనే ఇతర దేశాల ప్రజలు హడలిపోతున్నారు. 
 
ఈ నేపథ్యంలో బ్రిటన్ నుంచి ఢిల్లీ వచ్చిన సదరు వ్యక్తి అక్కడి నుంచి చెన్నై చేరుకున్నాడు. కరోనా సోకినట్టు తేలడంతో అతడిని క్వారంటైన్‌లో ఉంచారు. బ్రిటన్‌లో రూపాంతరం చెందిన కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆ వ్యక్తి నుంచి నమూనాలు సేకరించి పూణేలోని జాతీయ వైరాలజీ సంస్థకు పంపించారు. ఆ వ్యక్తికి సోకింది కరోనా కొత్త రకం వైరస్సా? కాదా? అనేది పరీక్షల అనంతరం వెల్లడి కానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments