Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్ధవ్‌ ఠాక్రేకు గవర్నర్ ఆహ్వానం : వారంలో బలం నిరూపించుకోవాలి...

Webdunia
బుధవారం, 27 నవంబరు 2019 (14:01 IST)
శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేకు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ నుంచి ఆహ్వానం అందింది. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ కోరారు. అలాగే, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారం రోజుల్లో అసెంబ్లీలో మెజార్టీని నిరూపించుకోవాలని కోరారు. ఈ మేరకు ఉద్ధవ్ ఠాక్రేకు గవర్నర్ నుంచి ఓ లేఖ వచ్చింది. 
 
దీంతో గవర్నర్ కోరిక మేరకు ఉద్ధవ్ ఠాక్రే గురువారం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముంబై, దాదర్‌లోని శివాజీ పార్కులో ఈ ప్రమాణ స్వీకార వేడుకలు జరుగనున్నాయి. అయితే, ఉద్ధవ్ ఇపుడు ఏ సభలోనూ సభ్యుడు కాదు. అందువల్ల ఆయన ఆరు నెలల్లో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సివుంటుంది. 
 
మరోవైపు, తన భార్య రష్మీతో కలిసి బుధవారం ఉద్ధవ్ ఠాక్రే... మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీతో సమావేశమైన విషయం తెలిసిందే. గవర్నర్‌తో ఉద్ధవ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారని శివసేన నేతలు అంటున్నారు. అయితే, ప్రభుత్వ ఏర్పాటు విషయంలో చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో రేపు సాయంత్రం 6.40 గంటలకు దాదర్‌లోని శివాజీపార్క్‌లో ఉద్ధవ్.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments