Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటర్లు సమ్మర్ హాలిడేస్‌కు వెళ్లడం వల్లే ఓడిపోయాం : లక్ష్మీనారాయణ

ఇటీవల దేశంలో వెలువడిన ఉప ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోవడానికి కారణాలను ఆ రాష్ట్ర కేబినెట్ మంత్రి ఒకరు వివరించారు. వేసవి సెలవుల కోసం ఓటర్లంతా తమతమ పిల్లలతో సొంతూర్లకు వెళ్లడం వల్లే ఓడిపోయి

Webdunia
సోమవారం, 4 జూన్ 2018 (09:16 IST)
ఇటీవల దేశంలో వెలువడిన ఉప ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోవడానికి కారణాలను ఆ రాష్ట్ర కేబినెట్ మంత్రి ఒకరు వివరించారు. వేసవి సెలవుల కోసం ఓటర్లంతా తమతమ పిల్లలతో సొంతూర్లకు వెళ్లడం వల్లే ఓడిపోయినట్టు లక్ష్మీనారాయణ చౌదరి అనే మంత్రివర్యులు సెలవిచ్చారు.
 
ముఖ్యంగా, ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కైరానా లోక్‌సభ, నుపూర్ అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ చిత్తుగా ఓడిపోయిన విషయం తెల్సిందే. బీజేపీ సర్కారుపై వ్యతిరేకతే ఈ ఓటమికి కారణమని విశ్లేషకులు చెబుతుండగా, అబ్బే అలాంటిదేమీ లేదని యోగి కేబినెట్‌లోని ఓ అమాత్యుడు సెలవిచ్చారు. 
 
ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఓటమిపై మంత్రి లక్ష్మీనారాయణ చౌదరి మాట్లాడుతూ నిజానికీ ఎన్నికలను సాధారణ ఎన్నికలతో పోల్చకూడదని పేర్కొన్నారు. ప్రభుత్వ పనితీరుకు ఈ ఫలితాలు ఎంతమాత్రమూ గీటురాయి కావన్నారు. 
 
పిల్లాపాపలతో కలిసి తమ ఓటర్లు వేసవి సెలవులకు వెళ్లడంతోనే తాము ఓడిపోయామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఇలా జరగదని, ఓటర్లంతా కమలం గుర్తుకే ఓటు వేస్తారంటూ ఆయన సెలవిచ్చారు. మంత్రి వ్యాఖ్యలతో ప్రతిపక్ష నేతలతో పాటు సొంత పార్టీ నేతలు కూడా అవాక్కయ్యారు. 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments