Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల కపిలేశ్వర ఆలయంలో ఆడుకుంటున్న చిరుతపులులు (video)

Webdunia
బుధవారం, 19 మే 2021 (11:57 IST)
తిరుపతిలోని కపిలేశ్వర ఆలయంలో చిరుతపులుల సంచారం కలకలరేపుతోంది. రెండు చిరుత పులులు ఆలయంలో తిరుగుతూ కనిపించాయి. ఈ దృశ్యాలన్నీ మొత్తం సి.సి.టీవీలో రికార్డయ్యాయి. అయితే కరోనా కారణంగా ఆలయాన్ని మూసివేయడంతో నిర్మానుషంగా ఉన్న కారణంగా చిరుతలు వచ్చినట్లు టిటిడి సెక్యూరిటీ సిబ్బంది భావిస్తున్నారు.
 
కరోనా కారణంగా తిరుమలలో క్రమేపీ భక్తుల సంఖ్య తగ్గుతుంటే స్థానిక ఆలయాల్లో అయితే భక్తులే కనిపించడం లేదు. అందులోను స్థానిక ఆలయాలను ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు తెరిచి ఉండడంతో భక్తులు తక్కువ సంఖ్యలో దర్సనం చేసుకుంటున్నారు. 
 
ఆ తర్వాత భక్తులు లేకపోవడంతో ఆలయాలన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. అందులోను టిటిడి ఆధ్వర్యంలో నడుపబడే తిరుపతిలోని కపిలేశ్వర ఆలయం సరిగ్గా శేషాచలం అడవులకు సమీపంలో ఉంది. శేషాచలం అడవుల్లో చిరుత పులల సంచారం ఎప్పటి నుంచో ఉంది. నిర్మానుషంగా ఉండటంతో చిరుత పులులు ఇష్టానుసారం జనం తిరిగే ప్రాంతంలోకే వచ్చేస్తున్నాయి.
 
కపిలేశ్వర ఆలయంలో కూడా రాత్రి 7 గంటల సమయంలో రెండు చిరుతపులులు వచ్చినట్లు టిటిడి సెక్యూరిటీ సిబ్బంది సిసి కెమెరాల ద్వారా గుర్తించారు. అక్కడున్న టిటిడి సెక్యూరిటీ సిబ్బందిని అలెర్ట్ చేశారు. అయితే అప్పటికే చిరుతలు దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయాయి. కానీ మొట్టమొదటి సారి ఆలయంలోకి చిరుతలు రావడం ఇదే ప్రధమమంటున్నారు టిటిడి అధికారులు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments