Webdunia - Bharat's app for daily news and videos

Install App

వధూవరులపై కరెన్సీ నోట్ల అక్షింతలు చల్లిన ఓ అతిథి..

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (18:19 IST)
మనలో చాలామంది పెళ్లి జరిగిన తర్వాత వధూవరులను ఆశీర్వదించడానికి వాళ్ల నెత్తి మీద అక్షింతలు చల్లి, అలాగే వారి చేతిలో ఓ గిఫ్ట్ పెట్టి, పెళ్లి శుభాకాంక్షలు చెప్పి, భోజనం చేసి వెనక్కి వచ్చేస్తుంటాము. అయితే ఈ అతిథి మాత్రం చాలా ఖరీదైన అతిథి. వధూవరులకు మామూలు అక్షింతలు వేస్తే ఎలా? మన పరువేం కాను అనుకున్నాడో ఏమో. ఏకంగా ఓ పెళ్లి వేడుకలో వధూవరులపై కరెన్సీ నోట్ల వర్షాన్ని కురిపించాడు.
 
ఈ అతిథి మాత్రం ఓ బుట్టలో కరెన్సీ నోట్లను తీసుకొచ్చి అక్షింతలు వేసినట్లుగా వాటిని పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు మీద చల్లాడు. అతడు కరెన్సీ నోట్లను వాళ్ల మీద చల్లడమే ఆలస్యం మరో వ్యక్తి వచ్చి వాటిని కవర్‌లో వేయడం ప్రారంభించాడు. ఆ అతిథి వధూవరులపై కరెన్సీ నోట్ల వర్షాన్ని కురిపించడం చూసి పెళ్లికి వచ్చిన మిగితా అతిథులు మాత్రం నోరెళ్లబెట్టారట. 
 
ఈ తంతు హైదరాబాద్‌లో జరిగినట్లు, అలాగే ల‌క్ష‌ల‌ రూపాయలను కొత్త జంట మీద వెదజల్లినట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది. దానికి సంబంధించిన ఒక వీడియోను కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా తన ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments