Webdunia - Bharat's app for daily news and videos

Install App

వధూవరులపై కరెన్సీ నోట్ల అక్షింతలు చల్లిన ఓ అతిథి..

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (18:19 IST)
మనలో చాలామంది పెళ్లి జరిగిన తర్వాత వధూవరులను ఆశీర్వదించడానికి వాళ్ల నెత్తి మీద అక్షింతలు చల్లి, అలాగే వారి చేతిలో ఓ గిఫ్ట్ పెట్టి, పెళ్లి శుభాకాంక్షలు చెప్పి, భోజనం చేసి వెనక్కి వచ్చేస్తుంటాము. అయితే ఈ అతిథి మాత్రం చాలా ఖరీదైన అతిథి. వధూవరులకు మామూలు అక్షింతలు వేస్తే ఎలా? మన పరువేం కాను అనుకున్నాడో ఏమో. ఏకంగా ఓ పెళ్లి వేడుకలో వధూవరులపై కరెన్సీ నోట్ల వర్షాన్ని కురిపించాడు.
 
ఈ అతిథి మాత్రం ఓ బుట్టలో కరెన్సీ నోట్లను తీసుకొచ్చి అక్షింతలు వేసినట్లుగా వాటిని పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు మీద చల్లాడు. అతడు కరెన్సీ నోట్లను వాళ్ల మీద చల్లడమే ఆలస్యం మరో వ్యక్తి వచ్చి వాటిని కవర్‌లో వేయడం ప్రారంభించాడు. ఆ అతిథి వధూవరులపై కరెన్సీ నోట్ల వర్షాన్ని కురిపించడం చూసి పెళ్లికి వచ్చిన మిగితా అతిథులు మాత్రం నోరెళ్లబెట్టారట. 
 
ఈ తంతు హైదరాబాద్‌లో జరిగినట్లు, అలాగే ల‌క్ష‌ల‌ రూపాయలను కొత్త జంట మీద వెదజల్లినట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది. దానికి సంబంధించిన ఒక వీడియోను కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా తన ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments