Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏక కణ జీవి అమీబా సోకి బ్రెయిన్ ఇన్ఫెక్షన్ : యువకుడి మృతి

Webdunia
శుక్రవారం, 7 జులై 2023 (18:32 IST)
కేరళ రాష్ట్రంలో ఒక విషాదకర ఘటన జరిగింది. స్వేచ్ఛగా జీవించే ఏక కణజీవి అమీబా కారణంగా కేరళ రాష్ట్రంలోని అళపుళాలో ఓ యుకుడికి బ్రెయిన్ ఫీవర్ సోకి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. అళపుళాలోని పానవల్లి తీర ప్రాంతానికి చెందిన 15 యేళ్ళ బాలుడు  ప్రైమరీ అమీబిక్ మెనింగ్ ఎన్సెఫాలిటిస్ అనే వ్యాధి బారినపడినట్టు చెప్పారు. బాలుడి మరణాన్ని ఆరోగ్య మంత్రి ధృవీకరించారు.
 
అదేవిధంగా గతంలో ఐదు అరుదైన ఇన్ఫెక్షన్ కేసులు నమోదైనట్టు తెలిపారు. తొలిసారిగా 2016లో అళపుళాలోని తిరుమల వార్డులో ఈ కేసులు నమోదైనట్టు తెలిపారు. మలప్పురంలోని 2019, 2020 సంవత్సరాల్లో రెండు కేసులు నమోదయ్యాయని, 2020లో కోళికోడ్, 2022లో త్రిసూర్‌లో ఒక కేసు నమోదైనట్టు ఆమె త్రిశూర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 
 
ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు జ్వరం, తలనొప్పి, వాంతులు. కాగా, ఈ వ్యాధి సోకిన వారంతా మృతి చెందినట్లు ఆరోగ్య మంత్రి చెప్పారు. తద్వారా ఈ అరుదైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్ మరణాల రేటు 100 శాతంగా ఉంది. ఇన్ఫెక్షన్‌కు కారణమయ్యే అమీబా ఏక కణ జీవులు నిశ్చల నీటిలో కనిపిస్తాయని మంత్రి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments