Webdunia - Bharat's app for daily news and videos

Install App

రమ్య ఎటెళ్లిపోయింది.. వరదలు ముంచేస్తుంటే జర్మనీలో ఈ ఫోటో ఏంటి?

కాంగ్రెస్ నేత, సినీ నటి రమ్య ప్రజల సమస్యలపై స్పందించేందుకు ముందుంటారు. కాంగ్రెస్ నేతగా పార్టీకి సంబంధించిన అన్నీ విషయాల్లో చురుకుగా వ్యవహరిస్తుంటారు. గత కొంతకాలంగా ఆమె పార్టీకి, సోషల్ మీడియాకు దూరంగా

Webdunia
శనివారం, 25 ఆగస్టు 2018 (14:38 IST)
కాంగ్రెస్ నేత, సినీ నటి రమ్య ప్రజల సమస్యలపై స్పందించేందుకు ముందుంటారు. కాంగ్రెస్ నేతగా పార్టీకి సంబంధించిన అన్నీ విషయాల్లో చురుకుగా వ్యవహరిస్తుంటారు. గత కొంతకాలంగా ఆమె పార్టీకి, సోషల్ మీడియాకు దూరంగా వుంటున్నారు. కేరళ, కర్ణాటకల్లో వర్షాలు, వరదలు ముంచెత్తినా రమ్య స్పందించలేదు. దీనిపై నటి రమ్యపై నెటిజన్లు మండిపడుతున్నారు. 
 
అయితే ఉన్నట్టుండి నటి రమ్యకు సంబంధించిన ఒక ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కొద్ది కాలంగా కనిపించని రమ్య ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో పాటు జర్మనీ పర్యటనలో రమ్య వున్నారు. రమ్యతో పాటు కాంగ్రెస్‌ నేత మిలింద్‌ దియోరా కలిసి తీయించుకున్న ఫొటోతో పాటు కర్ణాటక ఇన్‌చార్జిలలో ఒకటైన మధుయాష్కి గౌడతో కూడా రమ్య దిగిన ఫొటో వైరల్‌ అవుతోంది.
 
రాష్ట్రంలోని కొడగు జిల్లా భారీ వర్షాలు, వరదలతో అట్టుడికిపోయి ప్రజలు హాహాకారాలు చేస్తుంటే కర్ణాటక రాష్ట్రానికి చెందిన రమ్యకు విదేశాలకు వెళ్ళాలనే ఆలోచన ఎలా వచ్చిందని నెటిజన్లు మండిపడుతున్నారు. మరి ఈ వార్తలపై రమ్య ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments