ఫ్యాక్షనిస్టుల్లా మోడీ - జగన్‌ : ఆ ఒక్క పని చేస్తే బాబు గెలుపును దేవుడూ ఆపలేడు...

Webdunia
మంగళవారం, 23 అక్టోబరు 2018 (11:27 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిలపై అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మండిపడ్డారు. వారిద్దరూ ఫ్యాక్షనిస్టుల్లా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. అదేసమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ ఒక్క పని చేస్తే ఆయన గెలుపును ఆ దేవుడు కూడా ఆపలేడని ఆయన జోస్యం చెప్పారు.
 
ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ప్రస్తుతానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎలాంటి ప్రజా వ్యతిరేకత లేదన్నారు. అయితే పార్టీ ఎమ్మెల్యేల్లో 35- 40 శాతం మందిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. వారిని మార్చితే మళ్లీ చంద్రబాబు గెలుపును దేవుడు కూడా ఆపలేరని వ్యాఖ్యానించారు.
 
'నిజం చెప్పాలంటే ప్రజలకు చంద్రబాబుపై వ్యతిరేకత లేదు. మా జాతి చరిత్ర బాగోలేదు. మా జాతి అంటే.. ఎమ్మెల్యేలు.. ఎంపీలం. బాగుండేవాళ్లను తెచ్చిపెట్టుకుంటే బాబే మళ్లీ సీఎం. నేను ఎప్పుడూ ఏ ఎమ్మెల్యే గురించీ అట్లా, ఇట్లా అని ఆయనకు చెప్పలేదు' అని వ్యాఖ్యానించారు. 
 
ఇకపోతే, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, వైసీసీ అధ్యక్షుడు జగన్‌ రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసినా వ్యక్తిగతంగా గెలుస్తారని.. కానీ వారు నిలబెట్టిన అభ్యర్థులు గెలుస్తారని చెప్పడం అబద్ధమే అవుతుందన్నారు. అదేసమయంలో జగన్‌, పవన్‌ భిన్నధ్రువాలని.. కలిసి పని చేయడం కష్టమని జేసీ అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prerna Arora: హిందీ లోనే కాక దక్షినాది లో కూడా ఆదరణ పొందుతున్న ప్రేరణ అరోరా

Kiran Abbavaram: చెన్నై లవ్ స్టోరీ సినిమా కంటెంట్ పై కాన్ఫిడెంట్ : కిరణ్ అబ్బవరం

Suriya4: సూర్య, నజ్రియా నజీమ్ చిత్రం షూటింగ్ షెడ్యూల్‌ ప్రారంభమైయింది

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

SS thaman: ఎస్ థమన్ ట్వీట్.. తెలుగు సినిమాలో మిస్టీరియస్ న్యూ ఫేస్ ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments