Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేణుమాధవ్‌పై అలాంటి ప్రచారం ఆపండి.. నేను చూసొచ్చాను.. జబర్దస్త్ రాకేష్

Webdunia
బుధవారం, 25 సెప్టెంబరు 2019 (11:16 IST)
హాస్యనటుడు వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా వుందని మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ స్పందించారు. వేణు మాధవ్ ఆరోగ్య పరిస్థితి విషమించిందని.. ఆయన మృతి చెందారని వస్తున్న వార్తలు నిజం కాదన్నారు.

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని రాకేష్ ఖండించారు.  వేణుమాధవ్ బాగుండాలని అందరూ కోరుకోవాలని.. దయచేసి ఇలాంటి పరిస్థితుల్లో దుష్ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
 
ఆయన మన మధ్య లేరని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియాలో ప్రచారం చేయడంపై రాకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి సోషల్ మీడియా నియంత్రణ పాటించాల్సిందిగా కోరారు. తాను స్వయంగా ఆస్పత్రికి వెళ్లి వేణు మాధవ్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నానని.. ఆయన శరీరం చికిత్సకు సహకరిస్తోందని, కోలుకుంటున్నారని చెప్పారు. 
 
ఆయన చనిపోయారంటూ టీవీల్లో వస్తున్న వార్తలు చూసి వేణు మాధవ్ తల్లి కలత చెందారని వాపోయారు. ఇలాంటి తరుణంలో ఏం చేయాలో తెలియక.. ట్విట్టర్ వీడియో ద్వారా అందరికీ ఈ విజ్ఞప్తి చేస్తున్నట్టు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments