Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేణుమాధవ్‌పై అలాంటి ప్రచారం ఆపండి.. నేను చూసొచ్చాను.. జబర్దస్త్ రాకేష్

Webdunia
బుధవారం, 25 సెప్టెంబరు 2019 (11:16 IST)
హాస్యనటుడు వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా వుందని మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ స్పందించారు. వేణు మాధవ్ ఆరోగ్య పరిస్థితి విషమించిందని.. ఆయన మృతి చెందారని వస్తున్న వార్తలు నిజం కాదన్నారు.

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని రాకేష్ ఖండించారు.  వేణుమాధవ్ బాగుండాలని అందరూ కోరుకోవాలని.. దయచేసి ఇలాంటి పరిస్థితుల్లో దుష్ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
 
ఆయన మన మధ్య లేరని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియాలో ప్రచారం చేయడంపై రాకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి సోషల్ మీడియా నియంత్రణ పాటించాల్సిందిగా కోరారు. తాను స్వయంగా ఆస్పత్రికి వెళ్లి వేణు మాధవ్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నానని.. ఆయన శరీరం చికిత్సకు సహకరిస్తోందని, కోలుకుంటున్నారని చెప్పారు. 
 
ఆయన చనిపోయారంటూ టీవీల్లో వస్తున్న వార్తలు చూసి వేణు మాధవ్ తల్లి కలత చెందారని వాపోయారు. ఇలాంటి తరుణంలో ఏం చేయాలో తెలియక.. ట్విట్టర్ వీడియో ద్వారా అందరికీ ఈ విజ్ఞప్తి చేస్తున్నట్టు చెప్పారు.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments