Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీకి చెక్.. కరీనాను రంగంలోకి దించనున్న హస్తం పార్టీ

Webdunia
సోమవారం, 21 జనవరి 2019 (10:26 IST)
బీజేపీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ నేతల ప్లాన్ చేస్తున్నారు. త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ గట్టి పట్టుదలతో ఉంది. ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్‌లో బీజేపీని మట్టికరిపించిన కాంగ్రెస్ పార్టీ.. అదే జోరును లోక్‌సభ ఎన్నికల్లోనూ కొనసాగించాలని కోరుకుంటోంది. 
 
బీజేపీకి కంచుకోటగా వున్న భోపాల్‌ను దక్కించుకోవాలంటే కరీనా లాంటి సెలబ్రిటీకి పోటీకి దించకతప్పదని కాంగ్రెస్ నాయకులు గుడ్డు చౌహాన్, అనీస్ ఖాన్ పార్టీ హైకమాండ్‌కు వివరించినట్లు సమాచారం. అభిమానగణంతో పాటు భర్త సైఫ్ అలీఖాన్ తాత ఒకప్పుడు భోపాల్ నవాబ్‌గా పనిచేశారు. నవాబ్ కాలం నుంచి ఆయనకు మంచి పేరుండటంతో.. సైఫ్ ఫ్యామిలీ నుంచి కాంగ్రెస్‌కు మంచి పేరు లభిస్తుందని టాక్. 
 
ఇంకా అందరూ కలిసి పనిచేస్తే కాంగ్రెస్‌కు విజయం తథ్యమని నేతలు భావిస్తున్నారు. మరోవైపు బీజేపీని ఎదుర్కొనే గట్టి నేతలు ఎవ్వరూ లేకపోవడంతోనే కాంగ్రెస్ నేతలు ఇప్పుడు కరీనాను పోటీకి దించాలని చూస్తున్నారని కమలనాథులు విమర్శించారు.

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments