బాబుకు మద్దతిచ్చి తప్పు చేశా.. జగన్ సీఎం అయ్యేవారు : పవన్

గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు తాను మద్దతివ్వకుండా ఉండివుంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి పీఠంపై వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి కూర్చొనివుండేవారని జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్య

Webdunia
బుధవారం, 3 అక్టోబరు 2018 (14:31 IST)
గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు తాను మద్దతివ్వకుండా ఉండివుంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి పీఠంపై వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి కూర్చొనివుండేవారని జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కానీ, ఆ ఎన్నికల్లో చంద్రబాబును గుడ్డిగా నమ్మి ఆయనకు మద్దతిచ్చి అతిపెద్ద తప్పు చేసినట్టు చెప్పుకొచ్చారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, 2014 ఎన్నికల్లో టీడీపీకి ఎందుకు మద్దతిచ్చాను, తప్పు చేశానని బాధపడుతున్నానన్నారు. తాను మద్దతివ్వడం వల్ల అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ నేతలు ఇపుడు రూ.వేల కోట్లు దోచుకుతింటున్నారని, సీఎం చంద్రబాబు డబ్బే ప్రధానంగా పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. డబ్బే ప్రధానం అనుకుంటే అంబానీ ప్రధాని అయ్యేవారని వ్యాఖ్యానించారు. 
 
ముఖ్యమంత్రి తనయుడు లోకేష్‌ రాష్ట్రంలో 14 వేల కిలోమీటర్లు రోడ్లు వేశామని చెబుతున్నారని, అయితే జంగారెడ్డిగూడెం నుంచి ఐఎస్‌ జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి ట్రాఫిక్‌ లేని సమయంలో 14 కిలోమీటర్లు వెళ్లేందుకు తనకు 40 నిమిషాలు పట్టిందని, దీన్నిబట్టి రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతోందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments