ఓటు వేసేందుకు ఆసక్తి చూపని తమిళనాడు ఓటర్లు? కరోనా భయమా?

Webdunia
మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (17:56 IST)
తమిళనాడులో ఓటింగ్ శాతం మధ్యాహ్నానికి చాలా తక్కువ నమోదైంది. ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులోనే తక్కువస్థాయిలో కేవలం 42.7 శాతం మాత్రమే మధ్యాహ్నం 3 గంటలకు నమోదైంది. దీనిప్రకారం చూస్తుంటే ఓటర్లు ఓటు వేసేందుకు ఆసక్తి చూపడం లేదని అర్థమవుతుంది. ఒకవైపు కరోనావైరస్ భయం వెంటాడుతోంది. 
 
ఐనప్పటికీ పోలింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఓటు వేసేందుకు వెళ్లిన వారికి శానిటైజర్లు ఇవ్వడంతో పాటు మాస్కు లేకుండా వచ్చినవారికి మాస్కులు కూడా ఇస్తున్నారు. అలాగే ఓటు వేసే సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ బటన్ నొక్కేందుకు చేతులకు ప్లాస్టిక్ కవర్లను కూడా సరఫరా చేస్తున్నారు.
 
 మరి ఓటింగ్ సరళి ఇలాగే కొనసాగితే ఏదో ఒక పార్టీకి భారీ పరాజయం తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. డిఎంకె గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుండగా అమ్మ జయలలిత పథకాలను అమలు చేయడమే కాకుండా ఆమె లేని లోటును సీఎం ఎడప్పాడి పళనిసామి కనిపించనివ్వకుండా బ్రహ్మాండంగా పరిపాలించారని అధికార పార్టీ అంటోంది. మరి విజయం ఎవరిదో మే 2 వరకూ వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments