Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ బడ్జెట్ జస్ట్ ట్రయల్.. ముందుంది అసలు సినిమా.. మోడీ

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (17:23 IST)
కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. పియూష్ గోయల్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ట్రయల్ మాత్రమేనని, అసలు సినిమా ముందుంది అంటూ వ్యాఖ్యానించారు.
 
ఈ తాత్కాలిక బడ్జెట్‌పై ఆయన స్పందిస్తూ, ఇది తాత్కాలిక బడ్జెట్ కేవలం ట్రైలరే అని, ఎన్నికల తర్వాత ఇండియా కొత్త అభివృద్ధి పుంతలు తొక్కించే దిశగా ఇది తీసుకెళ్తుందన్నారు. మధ్యతరగతి నుంచి కూలీల వరకు, రైతుల అభివృద్ధి నుంచి వ్యాపారుల వృద్ధి వరకు, తయారీ రంగం నుంచి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల వరకు, ఆర్థిక వ్యవస్థ వృద్ధి నుంచి నవ భారత్ నిర్మాణం వరకు ఈ తాత్కాలిక బడ్జెట్‌లో అన్నీ ఉన్నాయి అని మోడీ ప్రశంసల వర్షం కురిపంచారు. 
 
దేశ అభివృద్ధికి పన్ను చెల్లిస్తున్న సామాన్యులే కారణమని, వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు ఈ సందర్భంగా ఆయన అన్నారు. మధ్య, ఉన్నత తరగతి వర్గాలు నిజాయతీతో పన్నులు చెల్లించడం వల్లే కొత్త పథకాలు ప్రవేశపెట్టగలిగామని, పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్నామని ప్రధాని చెప్పారు. రూ.5 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి పన్ను మినహాయింపు ఇవ్వాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నదని, తమ ప్రభుత్వం ఆ ఆకాంక్షను నెరవేర్చిందని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టంచేశారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments