చంద్రుడిపై 4జీ, 5జీ నెట్వర్క్‌లకు ఏర్పాటు, నాసాతో డీల్ కుదుర్చుకున్న నోకియా

Webdunia
సోమవారం, 19 అక్టోబరు 2020 (13:22 IST)
వినేందుకు కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది వాస్తవం. ఇకమీదట చంద్రుడి మీదకు వెళ్లే వాళ్లు తమ స్మార్ట్ పోన్లను తీసుకెళ్లి అక్కడి నుంచి వాడుకోవచ్చు. చంద్రుడిపై మొబైల్ ఫోన్ నెట్ వర్క్‌ను ఏర్పాటు చేయాలని, అది కూడా 4జీ, 5జీ తరంగాల కమ్యూనికేషన్ నెట్వర్క్‌గా ఉండాలని భావిస్తున్న నాసా (అమెరికా అంతరి పరిశోధన సంస్థ) అందుకోసం ప్రముఖ టెలీ సంస్థ నోకియాతో డీల్ కుదుర్చుకుంది.
 
ఇందులో భాగంగా చందమామపై 4జి సెల్యులర్ నెట్వర్క్‌ను నోకియా ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్ట్ కోసం 14.1 మిలియన్ డాలర్ల నిధిని అందించనుంది. తొలుత చందమామపై 4జీఎల్జీఈ నెట్వర్క్‌ను ఏర్పాటు చేయనున్న నోకియా తదుపరి దశలో దానిని 5జీకి అప్‌గ్రేడ్ చేయనుంది. ఈ వ్యవస్థ అభివృద్ధి చెందితే చంద్రుడి ఉపరితలంపై సమాచార మార్పిడి మరింత వేగవంతమవుతుందని, దీంతో మరింత విశ్వనీయ సమాచారాన్ని ఎప్పటికప్పడు పొందవచ్చని నాసా వ్యాఖ్యానించింది.
 
మరో 8 సంవత్సరాలలో అనగా 2028లో చంద్రుడిపై ఓ స్థావరాన్ని ఏర్పాటు చేసుకునే లక్ష్యాన్ని గతంలోనే నిర్థేశించుకున్న నాసా అందుకు తగ్గట్టుగా తన ప్రణాళికను రూపొందిస్తోందని కార్యనిర్వాహక ప్రతినిధి జిమ్ బ్రిడెన్ స్వైన్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

Mammootty: 55వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో మెరిసిన మమ్ముట్టి భ్రమయుగం

Chinnay : రాహుల్ రవీంద్రన్, చిన్నయ్ వివాహంపై సెటైర్లు

Chandini Chowdary,: తరుణ్ భాస్కర్ క్లాప్ తో చాందినీ చౌదరి చిత్రం లాంచ్

Bandla Ganesh: వార్నింగ్ లు రాజకీయాల్లోనే సినిమాల్లో కాదు - హీరోలపైనా బండ్ల గణేష్ సెటైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments