Webdunia - Bharat's app for daily news and videos

Install App

లడఖ్‌లో టెన్షన్ - టెన్షన్ : ముగ్గురు భారతీయ సైనికుల మృతి

Webdunia
మంగళవారం, 16 జూన్ 2020 (14:46 IST)
భారత్ - చైనా దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తలు తలెత్తాయి. నిన్నటివరకు సమస్య ముగిసిందని భావించిన తరుణంలో మళ్లీ ఇరు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా లడఖ్ ప్రాంతంలో ఇరుదేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు భారత భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన లడఖ్ గాల్వన్ లోయలో జరిగింది. చైనా సైనికుల దాడిలో ఓ అధికారితో పాటు.. ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అలాగే, చైనా సైనికులు కూడా గాయపడినట్టు సమాచారం. 
 
చైనా సైనికులు హద్దుమీరిన చర్యలను భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్‌తో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సీడీఎస్ బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులను కూడా హుటాహుటిన పిలిపించారు. చైనా దూకుడుకు ఎలా అడ్డుకట్ట వేయాలన్న దానిపై చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. 
 
కాగా, 1962 యుద్ధం తర్వాత సరిహద్దుల్లో అనేక ఘర్షణలు జరిగినా, ప్రాణనష్టం జరగడం ఇదే ప్రథమం. సైనికాధికారి సహా ముగ్గురు మరణించడంతో భారత్ దీన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. అందుకే డ్రాగన్ కంట్రీకి తగిన గుణపాఠం చెప్పాలన్న ధోరణితో భారత్ ఉన్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagarjuna: పూరీ జగన్నాథ్, నాగార్జున చిత్రం షురు - తాజా న్యూస్

Priyanka: ప్రియాంక చోప్రా ను ఒంటరిగా రమ్మన్నాడు : ప్రియాంక తల్లి ఆరోపణ

Ketika Sharma: నితిన్.. రాబిన్‌హుడ్‌లో కేతిక శర్మను ప్రజెంట్ చేస్తూ స్పెషల్ సాంగ్

పొయెటిక్ మూవీ కాలమేగా కరిగింది విడుదల కాబోతుంది

శ్రీకాంత్ ఓదెల కథతో Al అమీనా జరియా రుక్సానా- గులాబీ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

ICE Apples: వేసవి కాలం తాటి ముంజలు.. మహిళల్లో ఆ సమస్యలుండవ్.. ఏంటవి?

Summer: వేసవిలో పిల్లలను రక్షించడం ఎలా..? మసాలా ఫుడ్, ఫ్రిజ్ నీరు వద్దు..

తర్వాతి కథనం
Show comments