పంజా విసరడానికి కూడా శక్తికావాలి: బైపోల్ రిజల్ట్స్‌పై రాజ్‌నాథ్

దేశంలో వెల్లడైన ఉప ఎన్నికల ఫలితాలపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తనదైనశైలిలో స్పందించారు. సింహం పంజా విసరడానికి కూడా శక్తి కావాల్సి ఉంటుందన్నారు.

Webdunia
శుక్రవారం, 1 జూన్ 2018 (08:59 IST)
దేశంలో వెల్లడైన ఉప ఎన్నికల ఫలితాలపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తనదైనశైలిలో స్పందించారు. సింహం పంజా విసరడానికి కూడా శక్తి కావాల్సి ఉంటుందన్నారు. గురువారం వెల్లడైన ఈ ఫలితాలపై ఆయన స్పందిస్తూ, 'ముందుకు లంఘించి దూకడానికి శక్తి కోసం ఎవరైనా రెండడుగులు వెనక్కి వేయాల్సిందే. ప్రస్తుత ఉప ఎన్నికల ఫలితాలూ అలాంటివే. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు జరిగిన ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి కూడా అలాంటిదే' అని ఆయన వ్యాఖ్యానించారు.
 
ఇకపోతే, బీహార్‌లో అధికార జేడీయు అభ్యర్థి చిత్తుగా ఓడిపోవడంపై ఆ పార్టీ నేతలు భారతీయ జనతా పార్టీపై నిందలు మోపుతున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీతో పాటు.. దాని మిత్రపక్షాలు ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా, పెట్రోలు ధరలు పెరుగుదల ప్రధానంగా ఉందన్నారు. 
 
పైగా, దేశవ్యాప్తంగా బీజేపీ అనుసరిస్తున్న విధానాలపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. పెట్రోలు ధరలు భారీగా పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి సామాన్యులు అల్లాడుతున్నారు. ఆ ప్రభావమే బీహార్‌లోనూ పడింది. పెట్రో ధరలు వెంటనే తగ్గించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments