నీ భార్య, కుమారుడిని కాల్చాను... జడ్జి సెక్యూరిటీగార్డు

Webdunia
ఆదివారం, 14 అక్టోబరు 2018 (14:55 IST)
ఢిల్లీ శివారు ప్రాంతమైన గుర్‌గ్రామ్‌లో దారుణం జరిగింది. రెండేళ్లుగా ఓ న్యాయమూర్తి వద్ద సెక్యూరిటీ అధికారిగా పనిచేస్తున్న మహిపాల్ సింగ్ అనే వ్యక్తి, నడిరోడ్డుపై న్యాయమూర్తి భార్య, కుమారుడుపై సర్వీస్ రివాల్వర్‌తో కాల్పులు జరిపాడు. ఆ తర్వాత జడ్జికి ఫోన్ చేసి 'భార్య, కుమారుడిని కాల్చాను' అని చెప్పాడు.
 
స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన ఆదివారం జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, అదనపు సెషన్స్ న్యాయమూర్తిగా ఉన్న కిషన్ కాంత్ శర్మ వద్ద మహిపాల్ సింగ్ అనే వ్యక్తి సెక్యూరిటీ అధికారిగా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య రీతూ (38), కుమారుడు ధ్రువ్ (18) ఉన్నారు. వారిద్దరూ షాపింగ్‌కు వెళ్లిన వేళ, భద్రత కోసం మహిపాల్ కూడా వెళ్లాడు. 
 
న్యాయమూర్తికి ఫోన్ చేసేందుకు క్షణాల ముందు వారిద్దరిపైనా తన సర్వీస్ రివాల్వర్తోనే కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ రీతూ, ధ్రువ్‌లు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, ప్రాణాలతో పోరాడుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై గురుగ్రామ్ తూర్పు డీసీపీ సులోచనా గుజ్రాల్ కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments