Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీ భార్య, కుమారుడిని కాల్చాను... జడ్జి సెక్యూరిటీగార్డు

Webdunia
ఆదివారం, 14 అక్టోబరు 2018 (14:55 IST)
ఢిల్లీ శివారు ప్రాంతమైన గుర్‌గ్రామ్‌లో దారుణం జరిగింది. రెండేళ్లుగా ఓ న్యాయమూర్తి వద్ద సెక్యూరిటీ అధికారిగా పనిచేస్తున్న మహిపాల్ సింగ్ అనే వ్యక్తి, నడిరోడ్డుపై న్యాయమూర్తి భార్య, కుమారుడుపై సర్వీస్ రివాల్వర్‌తో కాల్పులు జరిపాడు. ఆ తర్వాత జడ్జికి ఫోన్ చేసి 'భార్య, కుమారుడిని కాల్చాను' అని చెప్పాడు.
 
స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన ఆదివారం జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, అదనపు సెషన్స్ న్యాయమూర్తిగా ఉన్న కిషన్ కాంత్ శర్మ వద్ద మహిపాల్ సింగ్ అనే వ్యక్తి సెక్యూరిటీ అధికారిగా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య రీతూ (38), కుమారుడు ధ్రువ్ (18) ఉన్నారు. వారిద్దరూ షాపింగ్‌కు వెళ్లిన వేళ, భద్రత కోసం మహిపాల్ కూడా వెళ్లాడు. 
 
న్యాయమూర్తికి ఫోన్ చేసేందుకు క్షణాల ముందు వారిద్దరిపైనా తన సర్వీస్ రివాల్వర్తోనే కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ రీతూ, ధ్రువ్‌లు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, ప్రాణాలతో పోరాడుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై గురుగ్రామ్ తూర్పు డీసీపీ సులోచనా గుజ్రాల్ కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ‌న సైన్యాధ్య‌క్షుడికి విజ‌యోస్తు - జనసైన్యాన్ని ఓ రాజువై నడిపించు : చిరంజీవి

#chiranjeevi birthday : 'విశ్వంభరు'నికి జనసేనాని పుట్టిన రోజు శుభాకాంక్షలు

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments