దేవుడు వదిలిన బుల్లెట్ కరోనావైరస్, ఎదురుగా నిలబడ్డ భారత్: రాంగోపాల్ వర్మ

Webdunia
మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (19:55 IST)
కరోనావైరస్‌ను కంట్రోల్ చేయలేకపోవడంపై సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన స్టైల్లో విమర్శల వర్షం కురిపించారు. ప్రముఖ టెలివిజన్ ఛానల్ టీవి5తో ముఖాముఖి మాట్లాడిన ఆయన కరోనావైరస్ ఆవర్భవించి ఏడాది గడిచిన తర్వాత సెకండ్ వేవ్ వస్తుందని తెలిసి కూడా కుంభమేళాలు ఏంటండీ అని నిలదీశారు.
 
రాజకీయ సభలు పెట్టడాలు, ఓటర్లను సభలకు రప్పించి గొర్రెల మంద కింద ట్రీట్ చేశారంటూ విమర్సించారు. ఒకవైపు సామాన్య ప్రజానీకానికేమో... సామాజిక దూరం పాటించండి, మాస్కులు లేకుండా బయటకు రావద్దు, మాల్స్ బంద్, షాపులు బంద్ అంటారు. కానీ కుంభమేళాకు మాత్రం లక్షల మంది వస్తుంటే వదిలేస్తారు.
 
అదేమంటే దేవుడుపై విశ్వాసం అంటారు. అసలు కరోనావైరస్‌ను సృష్టించింది దేవుడు కాదా? కొంతమంది అనుకుంటున్నట్లు కలియుగంలో పాపం పెరిగిపోయింది కనుక వినాశనం సృష్టించేందుకు దేవుడే కరోనావైరస్ అనే బుల్లెట్టును వదిలాడు. ఆ కరోనావైరస్ బుల్లెట్ అక్కడా ఇక్కడా తిరిగి ఎటు పోదామా అని ఆలోచిస్తుంటే భారత్ వెళ్లి దాని ఎదురుగా నుంచుంది. ఇక ఆ కరోనాబుల్లెట్ దాని పని అదే చేస్తోంది అంటూ సెటైర్లు పేల్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆనంద్ దేవరకొండ చీకటి లోకంలో దేనికోసం నీ వెతుకులాటా?

Sharwanand: బైకర్ ఇంజన్ సిద్దమైంది. రేపు గ్లింప్స్ రాబోతోంది

Raviteja: సుమతీ శతకం ట్రైలర్ బాగా నచ్చింది, చిత్రం విజయవంత కావాలి: రవితేజ

పళ్లిచట్టంబి నుంచి కయదు లోహర్ ఫస్ట్ లుక్ విడుదల

కుమార్తె సుస్మితతో చిరంజీవిని కలిసిన కొండా సురేఖ.. హనుమంతుడి చిత్రం గిఫ్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2026: రొమ్ము క్యాన్సర్‌తో జీవిస్తున్న వారికోసం 5 మానసిక ఆరోగ్య చిట్కాలు

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

హైదరాబాదులో PMJ Jewels హాఫ్ శారీస్, పెళ్లి వేడుకల నగల డిజైన్ల ప్రదర్శన

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

తర్వాతి కథనం
Show comments