Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూమికి మరో ముప్పు : దూసుకొస్తున్న గ్రహశకలం

Webdunia
గురువారం, 22 జులై 2021 (18:16 IST)
భూమికి మరో ముప్పు పొంచివుంది. ఓ గ్రహ శకలం మెరుపు వేగంతో భూమివైపు దూసుకొస్తుంది. ఇది ఈ నెల 24వ తేదీన భూమిని దాటి వెళ్లిపోవచ్చని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) వెల్ల‌డించింది. దీనికి 2008 గో20గా నామకరణం చేశారు.
  
ఈ గ్రహశకలం ఓ స్టేడియం ప‌రిమాణం లేదా తాజ్‌మ‌హ‌ల్ కంటే మూడు రెట్లు పెద్ద‌గా ఉంద‌ని నాసా శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. గంట‌ల‌కు 18 వేల మైళ్ల వేగంతో అంటే సెక‌ను 8 కిలోమీట‌ర్ల వేగంతో ఇది భూమి వైపు దూసుకొస్తున్న‌ట్లు నాసా చెప్పింది.
 
ఈ స్పీడు కార‌ణంగా ఆస్ట‌రాయిడ్‌కు అడ్డుగా వ‌చ్చే ఏదైనా ధ్వంస‌మైపోతుంద‌ని స్పేస్ ఏజెన్సీ తెలిపింది. ఈ ఆస్ట‌రాయిడ్ వ్యాసం 220 మీట‌ర్లుగా ఉంది. ఇది భూమికి 28 ల‌క్ష‌ల‌ కిలోమీట‌ర్ల దూరం నుంచి వెళ్ల‌నుంది.
 
అంటే ఇది భూమి, చంద్రుడికి మ‌ధ్య ఉన్న దూరం కంటే ఎనిమిది రెట్లు. అయితే ఈ ఆస్ట‌రాయిడ్ సుర‌క్షితంగా భూమిని దాటి వెళ్లిపోతుంద‌ని నాసా తెలిపింది. అయితే ఈ ఆస్ట‌రాయిడ్ క‌క్ష్య‌ను అపోలోగా వ‌ర్గీక‌రించారు. ఈ కేట‌గిరీ ఆస్టరాయిడ్లు చాలా ప్ర‌మాద‌క‌రం. దీంతో ఈ ఆస్ట‌రాయిడ్ క‌ద‌లిక‌ల‌ను నాసా చాలా జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments