Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫ్రికా దేశంలో మరో కొత్త వైరస్ - ఇద్దరి మృతి

Webdunia
మంగళవారం, 19 జులై 2022 (08:44 IST)
ప్రపంచాన్ని వివిధ రకాల కొత్త వైరస్‌లు వణికిస్తున్నాయి. తాజాగా మరో కొత్త వైరస్ పురుడు పోసుకుంది. ఆఫ్రికా దేశాల్లో ఒకటైన ఘనాలో ఈ వైరస్ వెలుగు చూసింది. దీనికి మర్‌బర్గ్ అనే పేరు పెట్టారు. ఈ వైరస్ సోకిన ఇద్దరు వ్యక్తులు ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రజలతో పాటు వైద్య నిపుణులు ఉలిక్కిపాటుకు గురవుతున్నారు. 
 
ఇది ఎబోలా తరహా లక్షణాలు కలిగిన వైరస్‌ కారణంగా ఈనెల మొదట్లోనే ఆ ఇద్దరు మృతిచెందారు. కాగా ఆసుపత్రిలో చనిపోయే ముందు వారు డయేరియా, జ్వరం, వికారం, వాంతులు లాంటి లక్షణాలతో బాధపడినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే మృతుల నమూనాలు సేకరించి సెనెగల్‌లోని ప్రయోగశాలలో పరీక్షలు నిర్వహించిన తర్వాత మర్‌బర్గ్‌గా తేలినట్లు ఘనా హెల్త్ సర్వీస్ ఒక ప్రకటనలో తెలిపింది. 
 
ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ధ్రువీకరించింది. కాగా అప్రమత్తమైన ఘనా ప్రభుత్వం కట్టడి చర్యలు చేపట్టింది. అనుమానితులు, క్లోజ్‌ కాంటాక్ట్‌లను ఐసోలేషన్‌కు తరలించి వారిని పరీక్షిస్తోంది. 
 
ఇదిలావుంటే, ఎబోలా కుటుంబానికి చెందిన మర్‌బర్గ్‌ వైరస్ ఓ అంటువ్యాధి. ఇది గబ్బిలాల ద్వారా వ్యాపిస్తుంది. ఆ తర్వాత మానవుల్లో వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్‌ సోకిన వ్యక్తి శారీరక ద్రవాలు తాకినప్పుడు లేదా దగ్గర సంబంధాలు కలిగి ఉన్నప్పుడు ఒకరినుంచి మరొకరికి సోకే అవకాశాలుఉన్నాయి. ప్రాణాంతకమైన ఈ వైరస్‌ 2-21 రోజులపాటు ఓ వ్యక్తిలో సజీవంగా ఉంటుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం