Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ పాదయాత్రకు 200 రోజులు.. బంగీ జంప్ వైరల్.. (వీడియో)

సుదీర్ఘ పాదయాత్రకు నడుం బిగించిన ఏపీ విపక్ష నేత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసిన ప్రజా సంకల్ప యాత్ర 200 రోజులకు చేరింది. పాదయాత్ర సందర్భంగా పలుమార్లు జగన్ ఆరోగ

Webdunia
బుధవారం, 27 జూన్ 2018 (13:34 IST)
సుదీర్ఘ పాదయాత్రకు నడుం బిగించిన ఏపీ విపక్ష నేత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసిన ప్రజా సంకల్ప యాత్ర 200 రోజులకు చేరింది. పాదయాత్ర సందర్భంగా పలుమార్లు జగన్ ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొన్నారు. అయినప్పటికీ  వెనక్కి తగ్గని ఆయన పాదయాత్రను కొనసాగించారు. వణికే చలితో మొదలెట్టి.. మండే ఎండను లెక్క చేయకుండా జగన్ పాదయాత్రను కొనసాగించారు. 
 
తన పాదయాత్రలో భాగంగా ఇప్పటివరకూ వైఎస్ జగన్ 2434.2 కిలోమీటర్లు నడిచారు. రాజన్న రాజ్యాన్ని తిరిగి ఏపీలోకి తేవటమే తన సంకల్పమని.. అలా చేసి ప్రజల ముఖాల్లో చిరునవ్వులు చూడటమే తన లక్ష్యమని 200 రోజుల పాటు పాదయాత్రను పూర్తి చేసుకున్న సందర్భంగా జగన్ తాజా ట్వీట్ లో పేర్కొన్నారు. 
 
ఇదిలా ఉంటే.. గత ఏడాది తన కుటుంబంతో కలిసి న్యూజిలాండ్ పర్యటకు వైసీపీ అధినేత జగన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా జగన్ ఒక సాహసం చేశారు. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కవారా బ్రిడ్జ్‌పై నుంచి ఆయన బంగీ జంప్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూడండి ఈ వీడియోను...
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments