Webdunia - Bharat's app for daily news and videos

Install App

అశోక్ గజపతి రాజుకు మరో అవమానం: రాముడి విగ్రహానికి ఇచ్చిన విరాళం తిరస్కరణ

Webdunia
సోమవారం, 18 జనవరి 2021 (11:24 IST)
సీనియర్ టిడిపి నాయకుడు, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజుకు మరో అవమానం జరిగింది. ఎపి ఎండోమెంట్స్ విభాగం ఆయన ఇచ్చిన రూ .1,01,116 విరాళాన్ని తిరస్కరించింది. విజయనగరం జిల్లాలో రామతీర్థంలోని రాముని విగ్రహాన్ని కొన్ని వారాల క్రితం దుండగులు అపవిత్రం చేసిన సంగతి తెలిసిందే.
 
తన విరాళాన్ని తిరస్కరించడంపై గజపతిరాజు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసారు. “మొదట, వారు నన్ను ఏకపక్షంగా వంశపారంపర్య ధర్మకర్త/ఛైర్మన్ పదవి నుంచి తొలగించారు. సెక్షన్ 28కి పూర్తి విరుద్ధంగా నోటీసు కూడా జారీ చేయకుండా ఆ పని చేసారు. ఇప్పుడు ఆ రామచంద్రునికి ఇచ్చిన విరాళాన్ని తిరస్కరించారు. ” అని పేర్కొన్నారు.
 
కాగా ఆలయ పరిపాలనలో తన విధులను నిర్వర్తించడంలో టిడిపి నాయకుడు అశోక్ గజపతి రాజు విఫలమయ్యారని పేర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని మూడు దేవాలయాల ఛైర్మన్ పదవి నుంచి ఆయనను తొలగించింది. కాగా ఆగమ మార్గదర్శకాల ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానాలు (టిటిడి) శ్రీరాముడి కొత్త విగ్రహాన్ని తయారుచేస్తున్నట్లు ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనర్ సి రంగారావు తెలిపారు.
 
మూడు అడుగుల పొడవైన విగ్రహాన్ని ఉచితంగా చేయడానికి టిటిడి ముందుకు వచ్చింది. రామతీర్థం వద్ద ధ్వంసమైన విగ్రహం రాతితో చెక్కబడింది, కొత్త విగ్రహం కూడా అలాగే ఉంటుంది. "కొత్త విగ్రహం కోసం చాలామంది విరాళాలతో ముందుకు వచ్చినప్పటికీ, టిటిడి విగ్రహాన్ని తయారు చేస్తున్నందున మేము వారి విరాళాలను తిరస్కరించాము" అని ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments