Webdunia - Bharat's app for daily news and videos

Install App

#JuhiChawlaకు రూ. 20లక్షల జరిమానా.. 5జీ నెట్‌వర్క్‌పై టైమ్ వేస్ట్... అంతా పబ్లిసిటీ కోసమే!

Webdunia
శుక్రవారం, 4 జూన్ 2021 (19:49 IST)
Juhi Chawla
బాలీవుడ్ నటి జూహీ చావ్లాకు ఢిల్లీ హైకోర్టుకు చుక్కెదురైంది. దేశంలో 5జీ నెట్‏వర్క్ ట్రయల్స్ వద్దంటూ జూహీ కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో శుక్రవారం ఈ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. ఇంకా ఆమె పిటిషన్‌ను తోసిపుచ్చింది. 
 
దేశంలో టెక్నాలజీ అప్ గ్రేడ్ కావాలని స్పష్టం చేసింది. అంతటితో ఆగకుండా అలాగే కోర్టు సమయాన్ని వృధా చేశారంటూ.. నటికి రూ. 20లక్షల జరిమానా విధించింది ఢిల్లీ హైకోర్టు. అంతేకాకుండా.. కోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలో ఆమె అభిమాని పాటలు పాడడం.. అందుకు సంబంధించిన వీడియోను నటి సోషల్ మీడియాలో షేర్ చేయడం పై ఆమె పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
 
ఈ విషయం గురించి కోర్టును ఆశ్రయించేకంటే ముందు ప్రభుత్వానికి లేఖ రాయాల్సిందని అభిప్రాయపడింది. ఈ పిటిషన్‌లో సరైన సమాచారం లేదని.. కేవలం పబ్లిసిటి కోసమే పిటిషన్ ధాఖలు చేశారని సీరియస్ అయ్యింది. 
 
ఇదిలా ఉంటే.. దేశంలో 5జీ టెక్నాలజీ వలన తీవ్రమైన ప్రమాదాలు జరుగుతాయని.. ఈ టెక్నాలజీ వలన ఎలాంటి ప్రమాదం లేదని.. ప్రభుత్వం నుంచి ధ్రువీకరణ లేఖ వచ్చేవరకు 5జీ నెట్ వర్క్ ట్రయల్ ఆపాలని కోరుతూ.. జూహీ చావ్లా సహా మరో ఇద్దరు పిటిషనర్లు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. 
 
దాదాపు 5 వేల పేజీల ఈ పిటిషన్‌లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ లాంటి ఏజెన్సీలతో పాటు యూనివర్సిటీలు, ప్రపంచ ఆరోగ్య సంస్థను పక్షాలుగా చేర్చారు. అయితే జూహీ ఈ పని చేసిందని.. అలాగే కోర్టు సమయాన్ని కూడా వృధా చేసిందని.. ఆమె పిటిషన్‏ను కోర్టు కొట్టివేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments