Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త రూల్స్‌కు ఫేస్‌బుక్ గ్రీన్ సిగ్నల్ .. ముగిసిన ‘కోడ్‌ ఆఫ్‌ ఎథిక్స్‌’ గడువు

Webdunia
బుధవారం, 26 మే 2021 (08:37 IST)
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ కేంద్ర ప్రభుత్వం విధించిన కొత్త రూల్స్‌కు పచ్చజెండా ఊపినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో దేశీయంగా ఎఫ్.బి సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి. 
 
నిజానికి దేశీయ ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ సేవలు బుధవారం నుంచి నిలిచిపోనున్నాయనే ప్రచారం జోరుగా సాగింది. సామాజిక, డిజిటల్‌ మాధ్యమాల్లోని కంటెంట్‌ను నియంత్రించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం గత ఫిబ్రవరిలో ‘కోడ్‌ ఆఫ్‌ ఎథిక్స్‌’ పేరిట కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది. 
 
వీటికి సంబంధించి యూజర్ల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడానికి మూడంచెల్లో గ్రీవెన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ను సిద్ధం చేసుకోవాలని కంపెనీలకు సూచించింది. దీని కోసం మే 25ను డెడ్‌లైన్‌గా నిర్ణయించింది. 
 
అయితే ప్రముఖ సామాజిక దిగ్గజాలు ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లు ఇప్పటికీ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఫిర్యాదుల పరిష్కారానికి భారతీయ అధికారులను నియమించడం, అభ్యంతరకరమైన కంటెంట్‌ను గుర్తించే పర్యవేక్షణ, మెకానిజమ్‌ను ఆయా సంస్థలు ఇంకా ఏర్పాటు చేసుకోలేదని పేర్కొన్నాయి. 
 
దీంతో బుధవారం నుంచి సోషల్‌ మీడియా సైట్లు, ఓటీటీలు బంద్‌ అవుతాయా? అన్న చర్చ మొదలైంది. కానీ, కేంద్రం తెచ్చిన కోడ్ ఆఫ్ ఎథిక్స్ రూల్స్‌కు వాట్సాప్‌తో పాటు.. ఫేస్‌బుక్‌ కూడా ఆమోదం తెలిపాయి. ఫలితంగా వీటి సేవలకు ఎలాంటి అంతరాయం సాగిపోనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments