Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో నిమిషానికి 30, చైనాలో 10, ఏంటవి?

Webdunia
మంగళవారం, 1 మార్చి 2022 (21:08 IST)
చైనా దేశంలో జననాల సంఖ్య విపరీతంగా పడిపోతోంది. నేషనల్ బ్యూరో ఆఫ్ చైనా డేటా ప్రకారం చైనాలో జననాల రేటు 2021 సంవత్సరంలో 7.52 మేరకు క్షీణించిపోయింది. పిల్లల్ని కనేందుకు ఎన్నో రివార్డులు ప్రకటిస్తున్నప్పటికీ చైనా జనాభా దాన్ని పెద్దగా పట్టించుకోవడంలేదు. జనాభా పెరిగిపోతుందని ఒక్కరే ముద్దు, ఇద్దరు వద్దు అంటూ ఏళ్లకు ఏళ్లపాటు కఠినంగా వ్యవహరించడంతో ఇప్పుడు చైనా జనాభా ఆ ఒక్కరు కూడా వద్దు అంటున్నారు.

 
చైనా జనాభా యువతలో సగటున 30 ఏళ్లు దాటనిదే పెళ్లి చేసుకోవడంలేదట. దీనితో 2011తో పోలిస్తే 2021లో 80 శాతం మేర వివాహ రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయి. చైనాలో జననాల రేటును పెంచేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం వుండటంలేదట. దీనితో మహిళలకు అబార్షన్లు, వాసెక్టమీ ఆపరేషన్లు చేయకుండా ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటోందట చైనా ప్రభుత్వం. ఇలా ఎన్ని చేసినప్పటికీ పిల్లల్ని కనేందుకు ఎంతమాత్రం ఉత్సాహం చూపించడంలేదట జనం.

 
కాగా ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో మొదటి స్థానం చైనాదే. ఆ దేశ జనాభా 144 కోట్లు. ఐతే వచ్చే నాలుగైదేళ్లలో ఈ సంఖ్యను మన దేశం దాటిపోనుంది. ప్రస్తుతం భారతదేశ జనాభా 140 కోట్లు. జననాల రేటు మన దేశంలో విపరీతంగా వుంటోంది. భారతదేశంలో సగటున నిమిషానికి 30 మంది జన్మిస్తుంటే చైనాలో ఆ సంఖ్య కేవలం 10 మాత్రమే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments