షాద్ నగర్‌లో డాక్టర్ ప్రియాంక దారుణ హత్య, అత్యాచారం చేసి చంపారా?

Webdunia
గురువారం, 28 నవంబరు 2019 (17:57 IST)
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలో మహిళా డాక్టర్ ప్రియాంకా రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఆమెను హత్య చేసిన దుండగులు గుర్తు తెలియకుండా పెట్రోలు పోసి తగులబెట్టారు. పూర్తిగా తగులబడిన స్థితిలో ఆమె మృతదేహం లభ్యమైంది. నిన్నరాత్రి 9.30 గంటల ప్రాంతంలో విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఆమె ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం స్కూటీ పంక్చర్ అయింది. దాంతో ఆమె వెంటనే కుటుంబ సభ్యలకు సమాచారం అందించింది. 
 
తన స్కూటీ పాడైందనీ, అక్కడ లారీ డ్రైవర్లు వున్నారనీ, భయపడుతూ చెప్పింది. కొద్దిసేపటికే ఆమె ఫోన్ స్విచాఫ్ అయిపోయింది. దాంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు విషయాన్ని పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం గాలించగా 28 తేదీ ఉదయం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపంలో 24వ నేషనల్ హైవే దగ్గర ఓ వంతెన కింద వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి మృతదేహం గుర్తుపట్టని విధంగా లభ్యమైంది. 
 
ఆమెని వేరే ప్రాంతంలో హత్య చేసి, ఇక్కడికి తీసుకొచ్చి తగలబెట్టినట్లు పోలీసులు ప్రాధమికంగా అనుమానిస్తున్నారు. ప్రియాంకా కాల్ లిస్టును పరిశీలిస్తున్నారు. లారీ డ్రైవర్లు ఘాతుకానికి పాల్పడి వుంటారన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  సమీపంలోని సీసీటీవీ పుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. కాగా ప్రియాంకా రెడ్డి నవాబుపేట మండలం కొల్లూరు వెటర్నరీ డాక్టర్‌గా పని చేస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెచ్యూర్డ్‌ అండ్‌ ఇన్‌స్పిరేషన్‌ స్టోరీతో రాబోతున్న సినిమా శ్రీ చిదంబరం గారు

టి గోపీచంద్, సంకల్ప్ రెడ్డి చిత్రం క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభం

ఓం శాంతి శాంతి శాంతిః ట్రైలర్ ను అభినందించిన విజయ్ దేవరకొండ

Sharwanand: న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ బా బా బ్లాక్ షీప్‌ టీజ‌ర్

Niharika Konidela: రాకాస గ్లింప్స్‌లో కామెడీ టైమింగ్‌తో మెప్పించిన సంగీత్ శోభన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments