Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్యలో అద్భుతం జరిగిందా? ప్రాణప్రతిష్ఠ తర్వాత తన రూపాన్ని మార్చుకున్న అయోధ్య రాముడు

ఐవీఆర్
గురువారం, 25 జనవరి 2024 (13:17 IST)
కర్టెసి-ట్విట్టర్
అయోధ్యలో అద్భుతం జరిగిందా? అంటే అవుననే అంటున్నారు స్వయంగా రాములవారి విగ్రహాన్ని మలిచిన అరుణ్ యోగిరాజ్. తను మలిచిన రాములవారి విగ్రహానికి అయోధ్య గర్భగుడిలో ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత రాముల వారి రూపానికి తేడా వున్నట్లు గమనించానన్నారు. వాస్తవానికి విగ్రహంలో తను ఎలాంటి మార్పులు చేయలేదనీ, ప్రాణప్రతిష్ఠ తర్వాత రాముల వారి రూపంలో వున్న తేడా ఎందుకు వచ్చిందన్నది తనకి కూడా తెలియలేదంటున్నారు. బహుశా అదంతా రాములవారి మహిమ అయి వుంటుందన్న చర్చ మొదలైంది.
 
శిల్పకారుడు అరుణ్ యోగిరాజ్ మలిచిన విగ్రహ రూపం తన ఫేస్ బుక్ లో పెట్టుకున్నారు. ఆ శిల్పానికి ప్రస్తుతం అయోధ్య గర్భగుడిలో ప్రతిష్ఠించిన శిల్పానికి.. ప్రధానంగా ముఖకవళికలలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. కనుబొమలు, చెక్కిళ్లు, కంటిపాపలు, పెదవులు, ముక్కు ఇలా అన్నింటిలోనూ స్పష్టమైన మార్పులు గోచరిస్తున్నాయి. నిజంగా రాములవారే అక్కడ నిల్చుని వున్నారా అనే అనుభూతి కలుగుతోంది.
 
అరుణ్ యోగిరాజ్ మాట్లాడుతూ... "దేవుడు లోపలికి వెళ్ళిన వెంటనే మారిపోయాడు. ప్రాణ్ ప్రతిష్ట తరువాత, రాంలల్లా మారిపోయినట్లు నేను చూశాను, ఇది నా పని కాదని నేను చెప్పాను." అని అన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Rohit: తను నా లక్కీ చార్మ్.. అందుకే సుందరకాండ చేశాం : నారా రోహిత్

బార్బరిక్.. ఫ్రీగా చూడాల్సిన మూవీ కాదని వాళ్లు డబ్బులు ఇచ్చారు : విజయ్ పాల్ రెడ్డి

సినిమాల్లోనే కాదు.. వ్యక్తిగతంగా లోపాలను వెతుకుతున్నారు : అనుపమ పరమేశ్వరన్

కపుల్ ఫ్రెండ్లీ లో సంతోష్ శోభన్, మానస వారణాసి ల కెమిస్ట్రీ సాంగ్

పవన్ చేతిపై ఉన్న టాటూ అక్షరాలకు అర్థమేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments