ఇమ్రాన్‌కు కంటిమీద కనుకు లేకుండా చేసిన జీ జిన్‌పింగ్

Webdunia
శుక్రవారం, 11 అక్టోబరు 2019 (09:39 IST)
చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం భారత్‌కు రానున్నారు. భారత్ చైనా ద్వైపాక్షిక చర్చల కోసం వచ్చే ఆయన చెన్నైకు చేరుకుంటారు. ఆ తర్వాత చెన్నై సముద్ర తీర పర్యాటక ప్రాంతమైన మహాబలిపురంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఉన్నతస్థాయి చర్చలు జరుపుతారు. 
 
అయితే, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్‌కు బయలుదేరేముందు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు తేరుకోలేని షాకిచ్చారు. కాశ్మీర్ అంశం పూర్తిగా ద్వైపాక్షిక అంశమేనంటూ తేల్చి చెప్పారు.  
 
నిజానికి చైనా అధ్యక్షుడి పర్యటన శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది. అయితే, 36 గంటల క్రితం వరకూ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చైనాలోనే ఉన్నారు. బీజింగ్‌లో జిన్‍పింగ్‌తో చర్చలు జరిపారు కూడా. ఆ సమయంలో కాశ్మీర్ అంశం ప్రస్తావనకు రాగా, ఈ వ్యవహారాన్ని ఇండియా, పాకిస్థాన్‌లు ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాల్సిందే మినహా, మరో దేశం కల్పించుకునే పరిస్థితి లేదని జిన్‌పింగ్ కుండ బద్దలు కొట్టారు. 
 
ఇటీవలి ఐరాస సమావేశాల్లో పాకిస్థాన్‌కు కొంత అనుకూలంగా మాట్లాడిన చైనా, ఆపై వారం రోజులు గడిచేసరికి, స్వరాన్ని మార్చుకోవడం భారత్ సాధించిన దౌత్య విజయమే. అంతేకాకుండా, చైనా అధ్యక్షుడి భారత్ పర్యటన పాకిస్థాన్ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments