కరోనా వైరస్ హాట్‌స్పాట్‌గా చెన్నై కోయంబేడు మార్కెట్

Webdunia
మంగళవారం, 5 మే 2020 (11:51 IST)
దేశంలోనే అతిపెద్ద కూరగాయల మార్కెట్‌గా ప్రసిద్ధికెక్కిన చెన్నై కోయంబేడు మార్కెట్ ఇపుడు వార్తల్లో అగ్రస్థానంలో నిలిచింది. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపించడానికి హాట్ స్పాట్‌గా ఈ మార్కెట్ నిలిచినట్టు భావిస్తున్నారు. ఇక్కడ పని చేసే కూలీలకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 527 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో ఈ మార్కెట్‌ను తాత్కాలికంగా మూసివేశారు. 
 
అంతేకాకుండా, ఈ కోయంబేడు మార్కెట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివశిస్తున్న వారికి హెల్త్ వర్కర్లు కరోనా పరీక్షలు చేస్తున్నారు. ముఖ్యంగా, కోయంబేడు మార్కెట్‌కు వచ్చి వైరస్ బారినపడిన వారి వివరాలను సేకరిచే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అంతేకాకుండా, ఈ మార్కెట్‌లో కూలీలుగా పని చేస్తూ వైరస్ బారినపడినవారిలో చెన్నై జిల్లాకు చెందిన 266 మంది కూలీలు ఉన్నారు. 
 
అలాగే, కడలూరు జిల్లాకు చెందిన కూలీలు 122 మంది, విళుపురంకు చెందినవారు 49, పెరంబలూరుకు చెందినవారు 25, తిరువణ్ణామలైకు చెందినవారు 11, దిండిగల్‌కు చెందినవారు 10, తెన్‌కాశి, తిరువళ్లూరు జిల్లాలకు చెందిన వారు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. కాగా, ప్రస్తుతం తమిళనాడులో మొత్తం కరోనా కేసులు 3550గా నమోదైవుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika Nair: శర్వా.. బైకర్ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ థియేటర్లలో స్క్రీనింగ్

Thaman: బాలకృష్ణ.. అఖండ 2: తాండవం బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్

Dulquer : దుల్కర్ సల్మాన్.. కాంత నుంచి రాప్ ఆంథమ్ రేజ్ ఆఫ్ కాంత రిలీజ్

Rashmika: ది గర్ల్ ఫ్రెండ్ లో రశ్మికను రియలిస్టిక్ గా చూపించా : రాహుల్ రవీంద్రన్

Bhumi Shetty: ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్ తో రాబోతున్న మహాకాళి చిత్రంలో భూమి శెట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments