Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ హాట్‌స్పాట్‌గా చెన్నై కోయంబేడు మార్కెట్

Webdunia
మంగళవారం, 5 మే 2020 (11:51 IST)
దేశంలోనే అతిపెద్ద కూరగాయల మార్కెట్‌గా ప్రసిద్ధికెక్కిన చెన్నై కోయంబేడు మార్కెట్ ఇపుడు వార్తల్లో అగ్రస్థానంలో నిలిచింది. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపించడానికి హాట్ స్పాట్‌గా ఈ మార్కెట్ నిలిచినట్టు భావిస్తున్నారు. ఇక్కడ పని చేసే కూలీలకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 527 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో ఈ మార్కెట్‌ను తాత్కాలికంగా మూసివేశారు. 
 
అంతేకాకుండా, ఈ కోయంబేడు మార్కెట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివశిస్తున్న వారికి హెల్త్ వర్కర్లు కరోనా పరీక్షలు చేస్తున్నారు. ముఖ్యంగా, కోయంబేడు మార్కెట్‌కు వచ్చి వైరస్ బారినపడిన వారి వివరాలను సేకరిచే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అంతేకాకుండా, ఈ మార్కెట్‌లో కూలీలుగా పని చేస్తూ వైరస్ బారినపడినవారిలో చెన్నై జిల్లాకు చెందిన 266 మంది కూలీలు ఉన్నారు. 
 
అలాగే, కడలూరు జిల్లాకు చెందిన కూలీలు 122 మంది, విళుపురంకు చెందినవారు 49, పెరంబలూరుకు చెందినవారు 25, తిరువణ్ణామలైకు చెందినవారు 11, దిండిగల్‌కు చెందినవారు 10, తెన్‌కాశి, తిరువళ్లూరు జిల్లాలకు చెందిన వారు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. కాగా, ప్రస్తుతం తమిళనాడులో మొత్తం కరోనా కేసులు 3550గా నమోదైవుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments