Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాబిల్లికి మరింత చేరువగా చంద్రయాన్-2... విజయవంతంగా చంద్ర కక్ష్యలోకి...

Webdunia
మంగళవారం, 20 ఆగస్టు 2019 (11:15 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన శాస్త్రవేత్తలు ప్రయోగించిన చంద్రయాన్ 2 వాహకనౌక చందమామకు మరింత చేరువైంది. జూన్ నెల 22వ తేదీన నింగిలోకి పంపిన చంద్రయాన్ 2 వాహకనౌక ప్రయాణంలో భాగంగా, మంగళవారం కీలక ఘట్టం చోటుచేసుకుంది. 
 
ఈ చంద్రయాన్-2ను ప్రయోగించిన 29 రోజుల తర్వాత ఈ వాహకనౌక చందమామ కక్ష్యలోకి విజయవంతంగా చేరింది. ఇస్రో శాస్త్రవేత్తలు మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల మధ్యలో 'మేక్ ఆర్ బ్రేక్'గా వ్యవహరించే ఈ ప్రక్రియను పూర్తి చేశారు.
 
ఇందుకోసం చంద్రయాన్-2 వేగాన్ని తగ్గించిన శాస్త్రవేత్తలు.. వాహకనౌకను చంద్రుడి కక్ష్యలోకి విజయవంతంగా చేర్చారు. ఇందుకోసం నౌకలోని ద్రవ ఇంజిన్‌ను మండించారు. ఈ నెల 21, 28, 30 తేదీల్లో ఇదే తరహా ప్రక్రియను చేపట్టి వాహకనౌకను చంద్రుడికి 150 కిలోమీటర్ల సమీపానికి తీసుకెళతారు.
 
ఈ వాహకనౌకలోని ల్యాండర్ వచ్చే నెల 7వ తేదీన చంద్రుడిపై ల్యాండ్ కానుంది. అనంతరం అందులోని రోవర్ ముందుకు దూసుకుపోనుంది. అనంతరం అక్కడి ఖనిజాలను, ఇతర వనరులను విశ్లేషించి సమాచారాన్ని ఆర్బిటర్, ల్యాండర్ ద్వారా భూమికి చేరవేయనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments