Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రెస్ కౌన్సిల్ నోటీసు ముఖంపై లాగిపెట్టి కొట్టినట్టే: చంద్రబాబు

Webdunia
ఆదివారం, 3 నవంబరు 2019 (09:51 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియా నియంత్రణ కోసం తీసుకువచ్చిన 2430 జీవోపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) దృష్టి సారించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. దుర్మార్గపు జీవో 2430 అంశంపై పీసీఐ సుమోటోగా స్పందించడం ద్వారా జగన్ సర్కారు ముఖంపై లాగిపెట్టి కొట్టినట్టయిందని వ్యాఖ్యానించారు. 
 
నిజాలను నిర్భయంగా వెల్లడించే జర్నలిస్టులను, సామాజిక మాధ్యమాల్లో ప్రజా సమస్యలపై గళం విప్పే సామాన్యులను వేధించేందుకే ఈ జీవో తెచ్చారని చంద్రబాబు ఆరోపించారు. ఏపీ సర్కారు ఈ జీవోను వెనక్కి తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. 
 
అదేవిధంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా స్పందించారు. ఏపీలో రెండు చానళ్ల ప్రసారాలు నిలిపివేస్తే టీడీశాట్ మందలించిందని తెలిపారు. రోజుకు రూ.2 లక్షలు జరిమానా విధించినా వైఎస్ జగన్ ప్రభుత్వానికి బుద్ధి రాలేదని విమర్శించారు. 
 
ఇప్పుడు చీకటి జీవో 2430పై పీసీఐ స్వయంగా స్పందించి సుమోటోగా కేసు నమోదు చేసిందని వెల్లడించారు. 'వినాశకాలే విపరీతబుద్ధి అన్నారు, మొట్టికాయలు పడేదాకా వీళ్లకి కళ్లు తెరుచుకోవు' అంటూ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments