Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ జిల్లాలో తన చెల్లికి న్యాయం జరగడం లేదని ఎడ్ల బండిపై ఢిల్లీకి యాత్ర

Webdunia
గురువారం, 26 మే 2022 (17:38 IST)
తన సోదరికి న్యాయం జరగడం లేదంటూ ఓ అన్న ఎడ్లబండి యాత్రను ఎన్టీఆర్ జిల్లా నుంచి ఢిల్లీకి ప్రారంభించాడు. ఎడ్లబండిపై తన తల్లితో కలిసి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి అక్కడ సుప్రీంకోర్టుకి, మానవ హక్కుల కమిషనుకి పిటీషన్ సమర్పించి తన చెల్లి కోసం న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు చెపుతున్నాడు. ప్రస్తుతం అతడి ఎడ్లబండి యాత్ర ఖమ్మం జిల్లా దాటింది.

 
వివరాల్లోకి వెళితే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ముప్పాళ్ళ గ్రామంలో నివాసం వుంటున్నారు నాగదుర్గారావు అతడి కుటుంబం. తన సోదరి నవ్యతను అదే మండలంలోని చందాపురం గ్రామానికి చెందిన కొంగర నరేంద్రనాథ్‌కి ఇచ్చి 2018లో ఘనంగా వివాహం చేసామనీ, కట్నంగా 23 లక్షలతో పాటు 320 గ్రాముల బంగారం, మూడు ఎకరాల పొలం ఇచ్చామని చెప్తున్నాడు. ఇంత ఇచ్చినా తన సోదరిని ఆమె అత్తమామలు వేధిస్తున్నారనీ, దాంతో తన చెల్లిని ఇంటికి తీసుకువచ్చిట్లు తెలిపాడు.

 
తన చెల్లి భర్త, అత్తమామల వేధింపులపైన చందర్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే వారి పలుకుబడితో కేసు ముందుకు కదలకుండా చేసారని వాపోయాడు. అందుకే ఢిల్లీలో న్యాయం కోసం పోరాటం చేయాలని నిర్ణయించుకుని ఎడ్ల బండిపై బయలుదేరినట్లు చెపుతున్నాడు.


ఇక్కడ న్యాయం జరగదని భావించి తన తల్లితో కలిసి ఢిల్లీ చేరుకుని సుప్రీంకోర్టులోనూ, హ్యూమన్ రైట్స్ కమిషన్ లోనూ తన చెల్లికి జరుగుతున్న అన్యాయంపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. సోదరి కోసం అన్నయ్య చేస్తున్న ఎడ్లబండి యాత్ర చర్చనీయాంశంగా మారింది. ఈరోజుల్లో పెళ్లయ్యాక ఎవరి బాధ వాళ్లది అనకునేవారు చాలామంది వున్నారు, ఐతే అందుకు భిన్నంగా సోదరి కోసం అన్న చేస్తున్న పోరాటంపై చర్చించుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments