భాజపాను ఏపీలో సమాధి చేస్తారు : బొండా ఉమామహేశ్వర రావు

గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని సమాధి చేసినట్టు వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని సమాధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు జోస్యం చెప్పారు.

Webdunia
గురువారం, 22 మార్చి 2018 (14:01 IST)
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని సమాధి చేసినట్టు వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని సమాధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు జోస్యం చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ కుటిల రాజకీయాలను దేశం మొత్తం కూడా వ్యతిరేకించే పరిస్థితి వచ్చిందన్నారు. 
 
విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన మోసం బయటపడుతుందనే అవిశ్వాసంపై చర్చ జరగకుండా అడ్డుకుంటున్నారన్నారు. కేంద్రానికి రాష్ట్ర బీజేపీ కూడా వంత పాడుతోందని ధ్వజమెత్తారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురావాల్సిన బాధ్యత రాష్ట్ర బీజేపీపైన లేదా? అని ప్రశ్నించారు. 
 
భాజాపా నేత విష్ణుకుమార్‌రాజు ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్‌ చేసే రీతిలో మాట్లాడుతున్నారని.. రాంమాధవ్‌, హరిబాబు రాష్ట్రంపై యుద్ధంచేస్తామంటున్నారని వీరందరినీ ప్రజాక్షేత్రంలోనే ఎదుర్కొంటామని చెప్పారు. జనసేన అధినేత పవన్‌కు నాలుగేళ్ల తరువాత ప్రభుత్వంలో అవినీతి కనపడుతోందా? అని ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments