Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడు సంవత్సరాలుగా కరెంట్ బిల్లు చెల్లించని బీజేపీ ఎంపీ?

Webdunia
మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (18:56 IST)
మనం ఒక్క నెల కరెంటు బిల్లు చెల్లించకుంటే ఫైన్ వేసి మరీ మరుసటి నెలలో చల్లిస్తాము. అయితే ప్రజాప్రతినిధుల వ్యవహారం వేరేలా ఉంటుంది. వారు తమ ప్రాబల్యంతో కరెంటు ఛార్జీలు చెల్లించకుండా మొండిగా వ్యవహరిస్తుంటారు. ఇలాంటిదే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఫరుకాబాద్ బీజేపీ ఎంపీ ముకేష్ రాజ్‌పూత్ ఇలాంటి ఘనకార్యమే చేసాడు. 
 
ఈ విషయం అయ్యగారు ఎలక్షన్ నామినేషన్ వేసేటప్పుడు బయటకు వచ్చింది. ఫరుకాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న ముకేష్ నామినేషన్ పత్రాలు దాఖలు చేసే క్రమంలో విద్యుత్‌శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ సమర్పించాల్సి వచ్చింది. కాగా గత ఏడు సంవత్సరాలుగా ముకేష్ విద్యుత్ బిల్లులు చెల్లించని కారణంగా విద్యుత్ శాఖకు లక్షల్లో బకాయిపడ్డాడు. 
 
నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిందిగా వారిని కోరగా బిల్లు చెల్లింపులు చేస్తేనే ఇస్తామని చెప్పడంతో సదరు ఎంపీ ఇంజినీర్‌కు ఫోన్ చేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ బెదిరింపుల ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎంపీ బెదిరింపులపై ఇంజినీర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసాడు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments