Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడెల శివప్రసాద్ చనిపోయాడని సంబరాలు చేసుకున్న భాజపా నేత.. ఎందుకో తెలుసా?

Webdunia
మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (17:17 IST)
మాజీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ మృతిపై రెండు తెలుగు రాష్ట్రాల్లోను తీవ్ర చర్చ దారితీస్తోంది. ఆత్మహత్య చేసుకుని చనిపోవడం ఏమిటో ఇప్పటికీ ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ప్రభుత్వ వేధింపులే కారణమని టిడిపి నేతలు ఆరోపిస్తుండగా, ప్రభుత్వం మాత్రం ఆ వ్యాఖ్యలను ఖండించడం లేదు.
 
అయితే తాజాగా కోడెల మృతి చెందడంపై విజయవాడలో వంగవీటి నరేంద్ర సంబరాలు చేసుకున్నారు. విజయవాడలోని వంగవీటి రంగా విగ్రహానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచుకుని టపాసులు కాల్చారు. జోహార్..జోహార్ రంగా అంటూ నినాదాలు చేశారు. ఏం జరుగుతుందో అర్థం కాక విజయవాడ ప్రజలు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు.
 
వంగవీటి మోహన రంగను దారుణంగా హత్య చేసిన సమయంలో హోంమంత్రిగా కోడెల శివప్రసాదరావు ఉన్నారట. కుట్రపూరితంగా రంగాను చంపించారని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఆయనే చనిపోయాడు కనుక నాకు చాలా సంతోషంగా ఉందంటూ వ్యాఖ్యానించాడు వంగవీటి నరేంద్ర. ప్రస్తుతం వంగవీటి నరేంద్ర బిజెపి పార్టీలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments