ప్రధాని మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ - హైదరాబాద్ - కేరళ యూనివర్శిటీల్లో ప్రదర్శన

Webdunia
బుధవారం, 25 జనవరి 2023 (15:23 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు సిరీస్ డాక్యుమెంటరీలను బీబీసీ ప్రసారం చేసింది. అయితే, వీటిని భారత్‌లో ప్రసారం చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. సోషల్ మీడియాతో పాటు మీడియాలో కూడా పలు రకాలైన ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో తెలంగాణా రాష్ట్రంలోని హైదరాబాద్, కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఈ డాక్యుమెంటరీలను ప్రదర్శించారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు చెందిన కొన్ని అనుబంధ విభాగాలు ప్రదర్శించాయి. 
 
ముఖ్యంగా, హైదరాబాద్ నగరంలోని సెంట్రల్ యూనివర్శిటీలో ప్రత్యేక స్క్రీన్లతో డాక్యుమెంటరీని ప్లే చేశారు. ఆ తర్వాత వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే, కేరళలోని పలు ప్రాంతాల్లో ఈ డూక్యుమెంటరీని ప్రదర్శించారు.
 
గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్న సమయంలో జరిగిన గోద్రా అల్లర్లను ఇతివృత్తంగా చేసుకుని బీబీసీ ఈ డాక్యుమెంటరీని రూపొందించింది. దాన్ని బీబీసీ రెండు భాగాల సిరీస్‌గా ప్రసారం చేసింది. ఈ డాక్యుమెంటరీ ఆగ్రహావేశాలు రేకెత్తించింది. బీజేపీతో దాని అనుబంధ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ఎంపిక చేసిన ఫ్లాట్‌ఫారమ్‌లపై ఈ డాక్యుమెంటరీ ప్రదర్శించకుండా కేంద్రం నిషేధించింది. 
 
అదేసమయంలో ఈ డాక్యుమెంటరీపై స్పందించేందుకు అమెరికా, బ్రిటన్ వంటి అగ్రదేశాలు ముందుకురాలేదు. ప్రపంచంలో ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న క్రేజ్‌ను తగ్గించడానికి బీబీసీ కుట్రపూరితంగా దీన్ని తయారు చేసిందని భారత మూలాలు ఉన్న ప్రవాసభారతీయులతో పాటు బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: మార్చి నెల ఉస్తాద్ గబ్బర్ సింగ్‌కు కలిసి వచ్చేలా వుంది

Sathya: నాగ చైతన్య చిత్రం వృషకర్మ లో సత్య లుక్‌

Srinath: మెన్షన్ హౌస్ మల్లేష్ నిజాయితీగా తీసిన సినిమా: శ్రీనాథ్ మాగంటి

Anantha Sriram: యూత్ కి ఒక యాంథమ్ లాగా ఉండాలనే రై రై రారా. పాట రాశాం : అనంత శ్రీరామ్

Bandla Ganesh: ఓటీటీ వద్దని సాయి, నితిన్‌కు ఫోన్‌ చేసి థియేటర్‌లో చేయమని చెప్పా : బండ్ల గణేష్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...

పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

తర్వాతి కథనం
Show comments