Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్య తీర్పు కోసం ఎదురు చూపులు...

Webdunia
సోమవారం, 4 నవంబరు 2019 (09:43 IST)
అయోధ్యలో రామజన్మభూమి - బాబ్రీ మసీదు వివాదం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వందేండ్లకుపైగా కొనసాగుతున్న ఈ వివాదంపై తుది తీర్పు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు సిద్ధమైంది. సీజేఐ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసులో 46 రోజులపాటు రోజువారీ విచారణ జరిపింది. 
 
అన్ని పక్షాల వాదలను విన్న అనంతరం.. తీర్పును రిజర్వ్‌లో ఉంచుతున్నట్టు గత నెల 16న ప్రకటించింది. ధర్మాసం ఏకగ్రీవంగా నిర్ణయాన్ని వెల్లడిస్తుందా? లేదా 4-1, 3-2 తేడాతో నిర్ణయం వెలువరిస్తుందా? అని ఆసక్తి నెలకొంది. ఈ తీర్పు ఎవరికి అనుకూలంగా ఉన్నా సామాజికంగా తీవ్ర ప్రభావం చూపనున్నది. 
 
ముఖ్యంగా వచ్చే తరాలపై తీర్పు ప్రభావం ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో హిందూ, ముస్లిం సంస్థల పెద్దలు తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా సంయమనం పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. అదేసమయంలో తీర్పు వచ్చిన వెంటనే నిర్మాణాలు ప్రారంభించకుండా.. కొన్నాళ్లపాటు ఆ స్థలాన్ని ఖాళీగా ఉంచాలని కోరుతున్నారు. మొత్తంమీద అయోధ్యపై సుప్రీంకోర్టు ఇచ్చే తుది తీర్పు పట్ల దేశం యావత్తూ ఉత్కంఠతగా ఎదురు చూస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments