Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీరామ జన్మస్థలం మార్చుకోవడం సాధ్యంకాదు... బాబర్ చేసింది చారిత్రక తప్పిదం

Webdunia
మంగళవారం, 15 అక్టోబరు 2019 (19:30 IST)
శ్రీరామ జన్మస్థలం మార్చుకోవడం సాధ్యపడదని సుప్రీంకోర్టు ధర్మాసనానికి ఓ హిందూపార్టీ తెలిపింది. అదేసమయంలో అయోధ్యలో శ్రీరాముని జన్మ స్థలంలో మసీదును నిర్మించడం ద్వారా మొఘలు చక్రవర్తి బాబర్ చారిత్రక తప్పిదం చేశారన్నారు. అందువల్ల ఈ తప్పును సరిదిద్దవలసిన సమయం ఆసన్నమైందని గుర్తుచేశారు. 
 
కాగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం అయోధ్య రామ జన్మభూమి వివాదంపై విచారణ జరుపుతున్న విషయం తెల్సిందే. పిటిషనర్లు మహంత్ సురేశ్ దాస్ తరపున సీనియర్ అడ్వకేట్ కె.పరాశరన్ మంగళవారం వాదనలు వినిపించారు. 
 
ఈ సందర్భంగా ఆయన అనేక అంశాలను ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అయోధ్యలో 50 నుంచి 55 మసీదులు ఉన్నాయని, ముస్లింలు ఈ మసీదులలో నమాజు చేసుకోవచ్చన్నారు. హిందువులు శ్రీరాముని జన్మ స్థలాన్ని మార్చుకోవడం సాధ్యం కాదని ధర్మాసనానికి పిటిషనర్ తరపు న్యాయవాది చెప్పారు.
 
ముఖ్యంగా, బాబర్ చక్రవర్తి భారతదేశాన్ని స్వాధీనం చేసుకుని, శ్రీరాముని జన్మ స్థలంలో మసీదును నిర్మించి, తనను తాను చట్టానికి అతీతంగా భావించారని పరాశరన్ సుప్రీంకోర్టుకు తెలిపారు. 
 
రామ జన్మభూమి వివాద స్థలం 2.77 ఎకరాలను మూడు సమాన భాగాలుగా చేసి, సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్ లల్లాలకు పంచాలని అలహాబాద్ హైకోర్టు 2010లో తీర్పుచెప్పింది. ఈ తీర్పుపై 14 అపీళ్ళు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. వీటిపై రోజువారీ విచారణ జరుగుతుండగా, మంగళవారంతో ఈ విచారణ 39వ రోజుకు చేరుకుంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments