Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో.. వీరబాదుడు... ట్రక్కు డ్రైవర్‌కు దేశంలోనే అత్యధిక అపరాధం

Webdunia
సోమవారం, 9 సెప్టెంబరు 2019 (11:17 IST)
దేశవ్యాప్తంగా కొత్త మోటారు వాహన చట్టం సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ట్రాఫిక్ పోలీసులు ఇష్టానుసారంగా తనిఖీలు చేస్తూ వాహనచోదకులను బెంబేలెత్తిస్తున్నారు. పైగా, కొత్త చట్టం మేరకు అపరాధం రుసుం వసూలు చేస్తున్నారు. దీంతో వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే వాహనం ఖరీదు కంటే అధిక మొత్తంలో జరిమానా విధించిన ఘటనలూ వెలుగులోకి వచ్చాయి. దీంతో పోలీసులు విధించిన అపరాధ రుసుం చెల్లించలేక వాహనాలను వదిలివేయడం లేదా కాల్చేయడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. 
 
తాజాగా ఒడిషా రాష్ట్రంలోని సంబల్‌పూర్‌ జిల్లాలో అశోక్‌ జాదవ్‌ అనే ట్రక్కు డ్రైవర్‌కు ట్రాఫిక్‌ పోలీసులు రూ.86,500 జరిమానా విధించారు. కొత్త చట్టం అమల్లోకి వచ్చాక దేశవ్యాప్తంగా విధించిన జరిమానాల్లో ఇదే అత్యధికం. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకపోవడంతో పాటు పరిమితికి మించి లోడు తీసుకెళ్లడం, ఇతర ఉల్లంఘనల కారణంగా సెప్టెంబరు 3వ తేదీన ఈ జరిమానాను విధించారు. అంత కట్టలేనని డ్రైవర్‌ దాదాపు ఐదు గంటలు వేడుకోగా రూ.70,000కు తగ్గించారు. అయితే ఇప్పుడా చలానా సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments