Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా హిజ్రా.. పేరు అప్సరా రెడ్డి

Webdunia
గురువారం, 10 జనవరి 2019 (10:04 IST)
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఓ హిజ్రాను (ట్రాన్స్‌జెండర్)ను ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నియమించారు. ఆమె పేరు అప్సరా రెడ్డి. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఈమె.. గతంలో అన్నాడీఎంకేకి అధికార ప్రతినిధిగా పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఆమె భారతీయ జనతా పార్టీలో చేరింది. అక్కడ నుంచి ఇపుడు కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఆమెను పార్టీలో చేర్చుకున్న రాహుల్ గాంధీ ఏకంగా ప్రధాన కార్యదర్శిగా నియమించారు. 
 
133 యేళ్ళ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఓ హిజ్రాను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించడం ఇదేతొలిసారి. జర్నలిస్టు, సామాజిక కార్యకర్తగా పని చేసిన అప్సరారెడ్డిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఏఐఎంసీ అధ్యక్షురాలు, ఎంపీ సుస్మితాదేవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నియమించారు. బాలలపై లైంగిక దాడులు, తదితర సామాజిక అంశాలపై అప్సరారెడ్డి కృషి చేస్తున్నారు. 
 
భారత జాతీయ కాంగ్రెస్ కుటుంబంలో అప్సరారెడ్డిని సభ్యురాలిగా నియమించినందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా అప్సరారెడ్డి స్పందిస్తూ అన్ని వర్గాల వారిని కలుసుకుంటూ.. మహిళల అభ్యన్నతి కోసం, వారి హక్కుల సాధనకు కృషి చేస్తానన్నారు. మహిళలకు ఆర్థిక సాధికారత సాధించడం కోసం వివిధ రాష్ట్రాల్లోని మహిళా కాంగ్రెస్ శాఖల అధ్యక్షురాళ్లతో కలిసి పని చేస్తానని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం