Webdunia - Bharat's app for daily news and videos

Install App

కులాలు, మతాలను విడదీసే సంస్కృతి బీజేపీది : యనమల ఫైర్

కులాలు, మతాలను విడదీసే సంస్కృతి భారతీయ జనతా పార్టీకి ఉందని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని ఆయన విమర్శలు గుప్పించారు.

Webdunia
బుధవారం, 9 మే 2018 (14:27 IST)
కులాలు, మతాలను విడదీసే సంస్కృతి భారతీయ జనతా పార్టీకి ఉందని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని ఆయన విమర్శలు గుప్పించారు. గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోడీ ఒక మాట మాట్లాడారనీ, ఇపుడు ప్రధాని అయ్యాక మరో మాట మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.
 
ముఖ్యంగా, కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటాను మోడీ తగ్గించాలని చూస్తున్నారని ఆరోపించారు. గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటా 50 శాతం ఉండాలని మోడీ డిమాండ్‌ చేశారని యనమల గుర్తుచేశారు. కానీ, ఇపుడు ప్రధాని అయ్యాక పన్నుల వాటాను 47 శాతానికి కుదించారని, ఇప్పుడు ఇంకా తగ్గించాలని చూస్తున్నారని మండిపడ్డారు. మోదీ సీఎంగా ఉన్నప్పుడు ఒక మాట... పీఎం అయ్యాక ఇంకోమాట మాట్లాడితే ఎలా? అని యనమల ప్రశ్నించారు.
 
అంతేకాకుండా, కులాలు, మతాలను విడదీసే సంస్కృతి బీజేపీకి ఉందని... టీడీపీది కుల, మతాలను కలిపే సంస్కృతి అని చెప్పుకొచ్చారు. టీడీపీని విమర్శించే నైతిక హక్కు బీజేపీకి లేదన్నారు. 15వ ఆర్థిక సంఘం విధివిధానాల వల్ల రాష్ట్రాలకు నష్టం కలుగుతుందని తెలిపారు. రాష్ట్రాల మౌలిక, ఆర్థిక స్వరూపాన్ని దెబ్బతీసే కుట్ర జరుగుతోందని... ఇది రాజ్యాంగానికే సవాల్‌ అని యనమల వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments