Webdunia - Bharat's app for daily news and videos

Install App

కులాలు, మతాలను విడదీసే సంస్కృతి బీజేపీది : యనమల ఫైర్

కులాలు, మతాలను విడదీసే సంస్కృతి భారతీయ జనతా పార్టీకి ఉందని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని ఆయన విమర్శలు గుప్పించారు.

Webdunia
బుధవారం, 9 మే 2018 (14:27 IST)
కులాలు, మతాలను విడదీసే సంస్కృతి భారతీయ జనతా పార్టీకి ఉందని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని ఆయన విమర్శలు గుప్పించారు. గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోడీ ఒక మాట మాట్లాడారనీ, ఇపుడు ప్రధాని అయ్యాక మరో మాట మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.
 
ముఖ్యంగా, కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటాను మోడీ తగ్గించాలని చూస్తున్నారని ఆరోపించారు. గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటా 50 శాతం ఉండాలని మోడీ డిమాండ్‌ చేశారని యనమల గుర్తుచేశారు. కానీ, ఇపుడు ప్రధాని అయ్యాక పన్నుల వాటాను 47 శాతానికి కుదించారని, ఇప్పుడు ఇంకా తగ్గించాలని చూస్తున్నారని మండిపడ్డారు. మోదీ సీఎంగా ఉన్నప్పుడు ఒక మాట... పీఎం అయ్యాక ఇంకోమాట మాట్లాడితే ఎలా? అని యనమల ప్రశ్నించారు.
 
అంతేకాకుండా, కులాలు, మతాలను విడదీసే సంస్కృతి బీజేపీకి ఉందని... టీడీపీది కుల, మతాలను కలిపే సంస్కృతి అని చెప్పుకొచ్చారు. టీడీపీని విమర్శించే నైతిక హక్కు బీజేపీకి లేదన్నారు. 15వ ఆర్థిక సంఘం విధివిధానాల వల్ల రాష్ట్రాలకు నష్టం కలుగుతుందని తెలిపారు. రాష్ట్రాల మౌలిక, ఆర్థిక స్వరూపాన్ని దెబ్బతీసే కుట్ర జరుగుతోందని... ఇది రాజ్యాంగానికే సవాల్‌ అని యనమల వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments