Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్టీ సిద్ధాంతాల కంటే... దేశ హితం ముఖ్యం : కేఈ కృష్ణమూర్తి

Webdunia
సోమవారం, 5 నవంబరు 2018 (17:12 IST)
పార్టీ సిద్ధాంతాల కంటే దేశ హితం ముఖ్యమని, అందుకే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపాల్సి వచ్చిందని ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పెట్టిన పార్టీ టీడీపీ అనడంలో సందేహం లేదని... కానీ, పార్టీ సిద్ధాంతాలు ముఖ్యమా? లేక దేశ శ్రేయస్సు ముఖ్యమా? అని అడిగితే... దేశ శ్రేయస్సుకే తాను ఓటు వేస్తానని తెలిపారు.
 
మిత్రులుగా భావించిన వారు శత్రువులుగా మారినప్పుడు... శత్రువులు మిత్రులుగా మారడంలో తప్పేముందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కన్నా భారతీయ జనతా పార్టీనే దేశానికి అత్యంత ప్రమాదకరమన్నారు. దేశంలోని కీలక వ్యవస్థలను నాశనం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీని ధీటుగా ఎదుర్కోవడానికే జాతీయ స్థాయిలో మహాకూటమి ఏర్పాటుకానుందని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు విభిన్నమైన సిద్ధాంతాలు కలిగిన పార్టీలన్నీ ఏకమవుతున్నాయని చెప్పారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments