Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాళ్లిద్దరూ కృష్ణార్జునులు వంటివారు.. రజనీకాంత్ కితాబు

Webdunia
ఆదివారం, 11 ఆగస్టు 2019 (15:26 IST)
ప్రముఖ సినీ నటుడు రజినీకాంత్ భారతీయ జనతా పార్టీపై ప్రశంసల జల్లు కురిపించారు. ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ద్వయాన్ని కొనియాడారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుపై రూపొందించిన పుస్తకావిష్కరణ కార్యక్రమం చెన్నైలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకయ్యనాయుడుతో పాటు హోంమంత్రి అమిత్‌షా, రజినీకాంత్ పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా సూపర్ స్టార్ మాట్లాడుతూ.. కాశ్మీర్ సమస్య పరిష్కారంలో బీజేపీ విజయవంతమైందన్నారు. ఆర్టికల్ 370 రద్దు బిల్లు విషయంలో చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు. ఈ బిల్లుపై పార్లమెంట్‌లో హోం మంత్రి అమిత్‌షా ప్రసంగం చాలా అద్భుతంగా ఉందని అభినందించారు. అంతేకాదు మోదీ, షాలు కృష్ణార్జునులవంటివారని రజినీకాంత్ అభివర్ణించారు.
 
కాశ్మీర్ అంశంపై వారిద్దరి వైఖరి, ఆర్టికల్ 370లను ప్రస్తావించిన రజనీకాంత్, ఈ విషయంలో తనకు చాలా సంతోషం కలిగిందని, వారిద్దరూ కలిసి కాశ్మీర్‌ను భారత్‌లో పూర్తిగా విలీనం చేయడంలో విజయవంతం అయ్యారని కొనియాడారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments