చూస్తుండగానే గోదావరిలో దూకిన యువకుడు, పరుగులు పెట్టిన పోలీసులు...

Webdunia
మంగళవారం, 13 జులై 2021 (18:15 IST)
గౌతమి గోదావరిలో మునిగిపోతున్న ఓ నిండు ప్రాణాన్ని ప్రాణాలకు తెగించి భారీ వర్షంలోనూ కాపాడి మరోమారు తమ మానవత్వాన్ని చాటుకున్నారు ఆలమూరు పోలీసులు.

వివరాల్లోకి వెళితే రంగంపేటకు చెందిన కోటిపల్లి నవీన్ ద్విచక్రవాహనంపై రావులపాలెం వైపు నుండి జొన్నాడ వైపు గౌతమి పాత బ్రిడ్జిపై వస్తూ తన ద్విచక్ర వాహనాన్ని ఆపి అకస్మాత్తుగా బ్రిడ్జిపై నుండి గోదావరిలో దూకగా అటువైపు గస్తీ తిరుగుతున్న ఆలమూరు ఎస్సై ఎస్.శివప్రసాద్‌తో పాటు హైవే పోలీస్ పెట్రోలింగ్ పైలెట్ జీ.వీ.వీ.ఎస్.మూర్తి, హెచ్ సీ ఆర్ఎస్వి రాజులు సంఘటనను గుర్తించి హుటాహుటిన గోదావరి గట్టుకు చేరుకొని భారీగా కురుస్తున్న వర్షంలో నావపై వెళ్లి ప్రాణాలకు తెగించి గోదావరి మధ్యలో మునిగిపోతున్న నవీన్ ను కాపాడగలిగారు.

అయితే పాత కొత్త బ్రిడ్జిపై వెళ్తున్న ప్రయాణీకులు జరుగుతున్న సంఘటనను ఉత్కంఠగా పరిశీలించారు. కాగా నవీన్ విశాఖ డైరీలో పని చేస్తున్నట్లు తెలియవచ్చింది. పోలీసుల్లో మానవత్వము ఉందంటూ పలువురు  పోలీసులను కొనియాడారు. కాగా నవీన్ గోదావరిలోకి దూకడానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివప్రసాద్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments