Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక మామిడి 10 వేలు.. మామిడి అమ్మి లక్షాధికారి అయిన బాలిక..!

Webdunia
సోమవారం, 28 జూన్ 2021 (23:07 IST)
ఓ బాలిక రోడ్డుపక్కనే మామిడి పండ్లను విక్రయిస్తోంది. ఒక వ్యక్తి వచ్చి మామిడి పండ్ల ధర అడక్కుండానే ఒక్కో మామిడి పండును 10 వేలకు కొంటున్నట్లు బాలికకు చెప్పాడు. అన్నట్లుగానే 12 మామిడి పండ్లను తీసుకొని లక్షా 20వేల రూపాయలు బాలిక తల్లి బ్యాంకు అకౌంట్లో వేశాడు. ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
 
జార్ఖండ్ జంషెడ్ పూర్‌కు చెందిన బాలిక పేరు తులసికుమారి. సాయం చేసిన వ్యక్తి పేరు హెగ్టే. వాలిబుల్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారట. పేద కుటుంబానికి చెందిన తులసీకుమారి ప్రభుత్వ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతోంది. 
 
కరోనా కారణంగా పాఠశాలలు మూతపడి ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. స్మార్ట్ ఫోన్ కొనే ఆర్థిక స్ధోమత లేక రోడ్డు పక్కన మామిడి పండ్లు అమ్ముతూ ఉండేది తులసి. అయితే తులసి తన ఆర్థిక కష్టాల గురించి స్థానిక మీడియాకు తెలిపిందట.
 
ఈ విషయం తెలుసుకున్న హెగ్టే బాలికకు సాయం చేయాలనుకున్నాడట. ఒక్కో మామిడి పండును 10 వేలకు కొంటున్నట్లు ఆయన చెప్పగానే తులసి ఆశ్చర్యానికి గురైంది. డబ్బులు తులసి తల్లి బ్యాంకు ఖాతాలో బదిలీ చేశారు. దీంతో తులసి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసి ఆన్లైన్ తరగతులకు హాజరవుతోందట. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments