అస్సాంలో చిరుత హడలెత్తించింది. గత 24 గంటల్లో 15మందిపై దాడికి పాల్పడిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఇనుప కంచె దాడి జనవాసాల్లోకి వచ్చిన చిరుత.. రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ నివాసితులపై దాడి చేసింది. ఈ దాడిలో 15మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.
క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని, వారి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు చెప్పారు. చిరుత పరుగెత్తుతున్న దృశ్యాలను అటవీ శాఖ సిబ్బంది వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.