లిక్కర్ కిక్కులో కాలనాగునే కాటేశాడు, ఆ తర్వాత?

Webdunia
బుధవారం, 6 మే 2020 (21:33 IST)
లిక్కర్ కిక్కు తలకెక్కితే వెయ్యి ఏనుగుల బలం వస్తుందంటారు. ఎంత పిరికోడికైనా కొండను ఢీకొట్టే ధైర్యం వస్తుందంటారు. ఈ మాటలన్నీ నిజమో.. అబద్ధమో మద్యం తాగేవారు చెప్పాలే కానీ చిత్తూరు జిల్లా సరిహద్దులో ఓ మందుబాబు ఏకంగా విషనాగునే కాటేశాడు. దాన్ని కసితీరా నోటితో కొరికి కొరికి చంపేశాడు. చిత్తూరు జిల్లా కర్ణాటక బోర్డర్లో జరిగిన ఈ సంఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది.
 
40 రోజుల లాక్ డౌన్ విరామం తరువాత ఓ మందుబాబుకి ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. వైన్ షాప్ తెరిచి తెరవగానే అక్కడకి చేరుకుని ఫుల్లుగా మందుకొట్టి అనంతరం తన బైక్ పైన బయలుదేరాడు. అయితే హఠాత్తుగా ఐదు అడుగుల పాము అతని మోటారు సైకిల్‌కు అడ్డంగా వచ్చింది. సడెన్ బ్రేక్ వేసి పామును చేత్తో పట్టుకుని అందరి ముందే నోటితో కొరికాడు. 
 
పాము చనిపోయేదాకా  వదల్లేదు. ఏదో సాధించిన వాడిలో చచ్చిపోయిన పామును మెడలో వేసుకున్నాడు. ఆ తరువాత బండిపై కూర్చుని మద్యం సేవించాడు. ఇక్కడ మనోడి అదృష్టంతో పాటు పాముకు దురదృష్టం వెంటాడి బతికి బట్టకట్టాడు కానీ ఏ మాత్రం అటుఇటూ అయ్యుంటే పరలోకానికి పొయ్యేవాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలగడం అపారమైన కృతజ్ఞతను నింపింది: రామ్ చరణ్

తెలుగు ప్రముఖ నటుడు రఘునాథ రెడ్డి ఇకలేరు

మెగా ఫ్యామిలీకి వారసుడొచ్చాడు.. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారు : చిరంజీవి

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టారోచ్

ఫంకీ లో రట్టాటటావ్ గీతంలో విశ్వక్ సేన్, కయాదు లోహర్‌ కెమిస్ట్రీ వన్నెతెచ్చింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

హైదరాబాదులో PMJ Jewels హాఫ్ శారీస్, పెళ్లి వేడుకల నగల డిజైన్ల ప్రదర్శన

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్‌కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ

హైదరాబాద్‌ ఐఆర్‌ఐఏ 2026లో బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ అధునాతన ఇమేజింగ్, ఏఐ సామర్థ్యాల ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments