భార్యకు మోపెడ్ కొనిపెట్టిన యాచకుడు.. ఎక్కడ (video)

Webdunia
మంగళవారం, 24 మే 2022 (17:19 IST)
Beggar
మధ్యప్రదేశ్‌లో ఓ యాచకుడు తన భార్య కోసం బుల్లెట్ కొనిపెట్టాడు. యాచకునికి రెండు కాళ్లు లేకపోవడంతో భార్య సాయంతో భిక్షాటన చేసేవాడు. 
 
మూడు చక్రాల వాహనంపై అతడు కూర్చుంటే.. భార్య అతనిని తోలుతూ వుండేది. అలా తోలుతున్న సమయంలో భార్య పడుతున్న కష్టాన్ని చూసి బాధపడిన యాచకుడు.. ఓ రోజు మోపైడ్ కొని గిఫ్ట్‌‌గా ఇచ్చాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే, చింధ్వారా జిల్లా అమరవర గ్రామంలో సంతోష్ సాహు దంపతులు నివాసం ఉండేవారు. సాహుకు రెండు కాళ్లు పనిచేయక పోవడంతో భార్య సహాయంతో భిక్షాటన చేసేవారు. త్రిచక్ర వాహనంలో తిరుగుతూ.. సాహూ యాచించేవాడు. 
 
వీరు యాచక వృత్తితోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చే వారు. రోజు వాహనాన్ని తోలుతుండడంతో భార్య అనారోగ్యానికి గురయ్యేది. ఆమె పడుతున్న కష్టాన్ని అతను చూడలేకపోయాడు. 
 
పైసా పైసా జమ చేశాడు సాహు. నాలుగు సంవత్సరాలుగా జమ చేసిన మొత్తం రూ. 90 వేలు అయిన తర్వాత.. మోపైడ్‌‌ను కొనుగోలు చేశాడు సాహు. ఇప్పుడు మోపైడ్‌‌పై భిక్షాటన చేస్తున్నారు. సాహు దంపతులు రోజుకు రూ. 300 నుంచి రూ. 400 వరకు సంపాదిస్తారని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments